ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో సింగర్ కౌశస్యకి సంబంధించిన న్యూస్ హాట్ టాక్స్ లా వినిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా కౌశల్య ఒంటరి  జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇక తాజాగా భార్యభర్తల విబేధాలతో కౌశల్య పోలీసు స్టేషన్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో కుటుంభ కలహాలు, భార్యభర్తల వేధింపు కేసులు వంటివి పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కౌశల్య సైతం ఈ భారీన పడింది. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని పాడిన గాయని కౌసల్యకు, ప్రేక్షకుల్లో మంచి ఆధరణ ఉంది.


ఇంతటి స్టార్ సెలబ్రిటి జీవితం ఇప్పుడు భర్త వేధింపుల కారణంగా పోలీసు స్టేషన్ కి రావటం అనేది అందరిని ఆశ్ఛర్యానికి గురిచేసింది. ఇక తాజాగా తన భర్త వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. “మీ కోసం” సినిమాతో ప్లేబ్యాక్ సింగర్ గా కెరీర్ ప్రారంభించిన కౌసల్య చిన్ననాటి స్నేహితుడైన బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. పెళ్లి తరువాత వీరిద్దరూ బాగానే ఉన్నప్పటికీ, మధ్య మధ్యలో కొద్దిపాటి ఘర్షనలు జరుగుతుండేవట.


అయితే గత 3 సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య మనస్ఫర్ధలు మరింతగా పెరిగిపోయాయి. ప్రస్తుతం కౌసల్య ఒంటరిగానే జీవితాన్ని కొనసాగిస్తుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫైనాన్షియల్ పరంగానే భర్త సపోర్ట్ లేకుండానే తనే లీడ్ చేసుకుంటుంది. అయితే ఇప్పటివరకు వారి వైవాహిక జీవిత విబేధాలు బయటపడనప్పటికీ తాజాగా కౌసల్య సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన భర్త వేధిస్తున్నారని ఆమె కంప్లైంట్ ఇచ్చారు.


దీంతో కౌసల్య భర్త బాలసుబ్రహ్మణ్యంను పోలీసులు పిలిచి కౌన్సెలింగ్ చేశారు. అయితే ఫైనాన్షియల్ కి సంబంధించిన వ్యవహారంలో ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చినట్టుగా పలువురు చర్ఛించుకుంటున్నారు. ఇక కౌసల్య సొంత ఊరు గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం. గుంటూరు మహిళా కళాశాలలో ఇంగ్లీషు లిటరేచర్, కర్ణాటక సంగీతాల్లో డిగ్రీ పూర్తిచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: