‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న జూనియర్ అభిమానులకు యంగ్ టైగర్ లేటెస్ట్ గా తీసుకున్న ఒక నిర్ణయం షాక్ ఇచ్చింది అని వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ లో దీపావళి కి విడుదల అయిన 'వేదాలం' సూపర్ హిట్ అయిన నేపధ్యంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారు అనే వార్తలు ఇప్పటికే ఉన్నాయి.

ఈవార్తల నేపధ్యంలో ఈ సినిమాను ఈ మధ్య జూనియర్ ప్రత్యేకంగా చూడటమే కాకుండా ఈ సినిమా రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న వార్తలు జూనియర్ అభిమానులకు షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈసినిమా కథ జూనియర్ గతంలో నటించిన 'ఊస‌ర‌వెల్లి' సినిమాకి ద‌గ్గ‌ర‌గా ఉంటుందని జూనియర్ అభిమానుల వాదన అని టాక్. ఎన్టీర్ తమన్నాలు జంటగా సురేంద్రరెడ్డి దర్శకత్వంలో నటించిన'ఊస‌ర‌వెల్లి' జూనియర్ కు ఘోరమైన ఫ్లాప్ ఇచ్చిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. 

దీనితో గతంలో ఫ్లాప్ ఇచ్చిన కథ పై మళ్ళీ జూనియర్ ఎందుకు మోజు పెంచుకుంటున్నాడు అంటూ జూనియర్ అభిమానులు టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వైపు సుకుమార్ తమ అభిమాన హీరో పై ఎటువంటి ప్రయోగాలు చేస్తున్నాడో తెలియక టెన్షన్ పడుతున్న యంగ్ టైగర్ అభిమానులకు ఈ ‘వేదాలం’ రీమేక్ మరో షాకింగ్ న్యూస్ గా మారింది అని అంటున్నారు. 

 మరి ఈ వార్తలు జూనియర్ వరకు వెళ్ళితే ఎన్టీఆర్ ఆలోచనలలో ఏమైనా మార్పులు వచ్చి గతంలో ‘కత్తి’ సినిమాను వదులు కున్నట్లుగా ఈ ‘వేదాలం’ కూడ వదులు కుంటాడెమో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: