యాంకర్స్ అందరూ ఈ మధ్య కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా చెలమాణి అవుదామని వస్తున్నారు. ఆ విధంగా వస్తున్న యాంకర్స్ ఎంత మంది హీరోయిన్స్ గా ఇక్కడ నిలదొక్కుకుంటున్నారు అనేది తెలియాల్సింది. ఈ మధ్య కాలంలో యాంకర్ పొజిషన్ నుండి హీరోయిన్స్ గా వస్తున్న వారిలో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారే ప్రశాంతి, రష్మి, అనసూయ. వీరిలో ప్రశాంతి కంప్లీట్ అడల్ట్ జోనర్ తో ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది.


ఇక గ్లామర్ హీరోయిన్స్ గా రష్మీ, అనసూయలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా అనసూయ జెడ్ స్పీడ్ తో దూసుకుపోవటానికి ప్రయత్నిస్తుంది. అడివి శేషు, ఆదాశర్మ జంటగా నటిస్తోన్న ఒక సినిమాలో అనసూయ కీలకమైన పాత్రకు ఎంపికైంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా రవికాంత్ పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉండటంతో, అది అనసూయ చేస్తే బాగుంటుందని ఈ సినిమా యూనిట్ భావించిందట.


అయితే నిజానికి ఈ రోల్ లో యాంకర్ రష్మి నటించాల్సి ఉంది. రష్మి ప్రస్తుతం గుంటూర్ టాకీస్ మూవీతో పాటు మరో మూవీలోనూ హీరోయిన్ గా నటించనుంది. తాజాగా వచ్చిన అడివి శేషు మూవీ ఆఫర్ ని రష్మి కాదనుకోవటంతో, ఈ ఆఫర్ అనుసూయని వరించిందట. ఇంతకీ రష్మి ఎందుకు ఈ ఆఫర్ ని వదులుకోవల్సి వచ్చిందంటే, రెమ్యునరేషన్ ని భారీగా డిమాండ్ చేసిందట.


రష్మి అడిగినంత రెమ్యునరేషన్ నిర్మాతలు ఇవ్వలేకపోవటంతో, వెంటనే వీరు అనసూయని అప్రోచ్ అయి గ్రీన్ సిగ్నల్ ని తీసుకున్నారు. తను కాదనుకున్న ఆఫర్ లో అనసూయ నటిస్తుందనే విషయం తెలుసుకొని ఈ బ్యూటీ షాక్ అయిందట. ఎందకంటే తన కాంపిటీటర్ కి ఇండైరెక్ట్ తనే ఛాన్స్ ఇచ్చినట్టుగా అయిందని...రష్మీ బాధపడుతుందట.



మరింత సమాచారం తెలుసుకోండి: