భాగ్యనగరంలో తాగుబోతులు రౌడీలు గొలుసు దొంగలు వల్ల ఎందరో ఇబ్బంది పడుతున్న సందర్భాలు సంఘటనలు చూస్తున్నాం. అయితే ఇటువంటి అనుకోని ఒక సంఘటన మెగాస్టార్ చిరంజీవికి కూడ ఎదురైంది అంటూ ఫిలింనగర్ లో గాసిప్పులు వినిపిస్తున్నాయి. ఇక వివరాలలోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన వ్యక్తిగత పనిమీద బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ కు వెళ్ళాడట.

చిరంజీవి తన పని ముగించుకుని తిరిగి వెళుతున్నప్పుడు కొందరు యువకులు తప్పతాగి చిరంజీవి కారును వెంబడించినట్లు టాక్. దానితో ఖంగారు పడ్డ చిరంజీవి తన వెంట ఉన్న సెక్యూరిటీ వారిని ఎలర్ట్ చేసి ఆ యువకుల వివరాలు సేకరించమని చెప్పినట్లు సమాచారం. 

అయితే ఈ వివరాలు సేకరించి చిరంజీవి ఆ యువకుల కుటుంబ సభ్యులకు తన దైన శైలిలో కౌన్సిలింగ్ ఇప్పిస్తాడా ? లేదంటే ఇక్కడితో ఆ విషయాన్ని వదిలేస్తాడా ? అన్న విషయమై క్లారిటీ లేదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న చిరంజీవికి కూడ తాగుబోతుల వేధింపులు తప్పక పోవడం ఆశ్చర్యo.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల పై ఇంకా స్పష్టమైన క్లారిటీ లేకపోయినా ఈ సంఘటనకు సంబంధించిన న్యూస్ మాత్రం ఫిలింనగర్ లో హాట్ గాసిప్ గా మారింది. తన 150వ సినిమా ఎప్పుడో తనకే అర్ధం కాని అయోమయ పరిస్థితులలో ఉన్న చిరంజీవికి ఈ సంఘటన మరో షాక్. చిరంజీవికి ఈమధ్య షాక్ లు మీద షాక్ లు తగులుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: