ప్రస్తతం ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల మధ్య పోటీతత్వం బాగా పెరుగుతుంది. ఒకరి మూవీ కంటే మరొకరి మూవీ బాగుండాలంటూ వీరు పడుతున్న పోటీ ప్రస్తుతం పీక్స్ కి చేరుకుంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు, చరణ్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ షాకింగ్ ఇచ్చాడంట. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ హాట్ టాక్స్ గా నిలుస్తున్నాడు.

ఇక ఈ దర్శకుడు తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ని హీరో ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీపై ఇప్పుడు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్, ఎన్టీఆర్-కొరటాల శివ ప్రాజెక్టుపై మరింత అంచనాలను పెంచటమే కాకుండా, రామ్ చరణ్ కి షాకింగ్ ని ఇచ్చిందని అంటున్నారు. కొరటాల డైరెక్షన్ లో రాబోతున్న యంగ్ టైగర్ మూవీలో, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం ఎన్టీఆర్ తో స్క్రీన్ స్పేస్ ని పంచుకోకున్నాడు.

ఇందులో ఓ కీలక పాత్రలో నటించనుండడం విశేషంగా మారింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇందులో రామ్ చరణ్ షాకింగ్ అయ్యేది ఏముంది అంటున్నారా? నిజానికి మోహన్ లాల్ ని చిరు 150వ సినిమాలో తీసుకోవాలని రామ్ చరణ్ ఆలోచిస్తున్నాడంట. కానీ ఇంతలో మోహన్ లాల్ ని ఎన్టీఆర్ తీసుకోవటంతో. ఇక రామ్ చరణ్ ఆ ఆలోచలను మానుకున్నాడని అంటున్నారు.

ఇక ఎన్టీఆర్ సరసన సూపర్ స్టార్ మోహన్ లాల్ వచ్చి చేరడంతో ఈ మూవీ రేంజ్ పీక్స్ కి చేరుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ మూవీ షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. దీని తరువాత కొరటాల కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్లనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: