'క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ' సీరియల్ ద్వారా  మంచి పేరు సంపాదించిన యశ్ పండిట్‌పై అత్యాచారం కేసు నమోదైంది. వివాహం చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసినట్టు ఆమె ముంబయిలోని జూహూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యా దు స్వీకరించింది.  సెప్టెంబర్ 13న షూటింగ్‌లో ఆ నటితో ఏర్పడిన రిలేషన్ కాస్త ఫ్రెండ్‌షిప్‌గా మారింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి మొదట ఆమెను కారులోనే లైంగికంగా అనుభవించాడని, మరోసారి తన పేరెంట్స్‌కి పరిచయం చేస్తానని చెప్పి ఇంటికి పిలిచి అత్యాచారం చేసినట్టు సమాచారం.

తనను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి  మరోసారి కూడా ఇదేవిధంగా తన ఇంటికి పిలిచి ఆమెతో సెక్స్ చేశాడు. ఆ..తర్వాత ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్ కాల్స్ కట్ చేయడం , ఆమె తో దూరంగా ఉండడం తో అతడి ఫై అనుమానం రాగా, గతం లో యశ్ పండిట్ చాలా  మంది అమ్మాయిలతో తనకు లైంగిక సంబంధం ఉందని తెలియడం తో ఆమె కు న్యాయం చేయమని పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది.  

మోసపోయిన సహనటి 


బాలీవుడ్ బుల్లితెరపై తనకు ఉన్న క్రేజి తో యశ్ చాలా  మంది అమ్మాయిలను  మోసగించి మాయ మాటలు చెప్పి వారి జీవితాలు నాశనం చేశారని తనలాగే చాలా మంది అమ్మాయిలు బలై పోయారని  బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.  ప్రస్తుతం పరారీలోవున్న యశ్ పండిట్, ముందస్తు బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు పెట్టుకున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: