హాట్ గాళ్ అనుష్క సూపర్ సినిమాతో కెరియర్ ప్రారంభించి ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో చేస్తూనే మరో పక్క ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తూ సూపర్ హిట్లు కొడుతుంది. రీసెంట్ గా రుద్రమదేవి సినిమా హిట్ జోష్ మీదున్న అనుష్క సైజ్ జీరో సినిమాతో కూడా ప్రెక్షకులను అలరిస్తుంది. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ట్రేడ్ టాక్. సినిమాలో లావుగా కనిపించడం కోసం నాచురల్ గానే లావైన అనుష్క సినిమా కోసం ఎంతటి రిస్క్ నైనా చేయడానికి సిద్ధమనేలా చేసింది.


అయితే ఇంత పట్టుదల ఉన్న అనుష్క టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజుకి మాత్రం షాక్ ఇచ్చిందట. ప్రస్తుతం సైజ్ జీరో తర్వాత అమ్మడు కమిట్ అయిన సినిమాల్లో దిల్ రాజు సినిమా కూడా ఒకటి. సైజ్ జీరో ఎలాగు వచ్చింది కాబట్టి. ప్రస్తుతం బాహుబలి సెకండ్ పార్ట్ కొన్ని సీన్లు ఇంకా సింగం సినిమా కూడా చేస్తుంది అనుష్క. అయితే ఆ సినిమాల టైంలోనే అనుష్కతో కృష్ణ వంశీ డైరక్షన్లో ఓ సినిమా ప్లాన్ చేశాడు దిల్ రాజు. రాజు అడిగాడు కదా అని అనుష్క కూడా ఓకే చెప్పిందట. 


ఇంతవరకు బాగానే ఉన్నా మళ్లీ అనుష్క దిల్ రాజు సినిమా చేసేందుకు వీలు లేదని తన మేనేజర్ తో చెప్పించిందట. అదేంటి ముందు చేస్తా అన్నది కదా అని అంటే. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలే కాక ఇంకా యు.వి ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్లో పిల్ల జమిందార్ డైరక్టర్ అశోక్ దర్శకత్వంలో భాగమతి సినిమా చేసేందుకు అడ్వాన్స్ తీసుకుంది అనుష్క. భాగ్యనగర రాణి భాగమతి సినిమా అనుష్కని ఊహించుకునే కథ రెడీ చేశాడు అశోక్. అయితే అప్పట్లో అతని మీద నమ్మకం లేక ఒప్పుకోని అనుష్క యు.వి ఆర్ట్స్ వారు అడిగేసరికి కాదనలేక పోయింది.


అయితే భాగమతి సినిమా టైంలోనే దిల్ రాజు కూడా డేట్స్ అడిగేసరికి ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేయలేక సారీ చెప్పిందట స్వీటీ. అయితే అది ఒక రీజనే అయినా కొంతకాలం మళ్లీ కమర్షియల్ సినిమాలే చేసి ఆడియెన్స్ కి దగ్గరయ్యే ఆలోచనల్లో ఉందట అనుష్క. మరి ఏం చేస్తుందో ఏమో తెలియదు కాని మొత్తానికి దిల్ రాజుకి హ్యాండ్ ఇచ్చి అతని మైండ్ బ్లాంక్ చేసేసిందని ఫిల్మ్ నగర్లో గుసగుస లాడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: