ప్రిన్స్ మహేష్ బాబు పొగడ్తలకు దూరంగా ఉంటాడు. స్వతహాగా మొహమాటస్తుడైన మహేష్ అందరితోను చాలామంది హీరోలులా కబుర్లు చెప్పడు. అందువల్ల మహేష్ కు ఉండే స్నేహితులు కూడ బాగా తక్కువే. అయితే రెండురోజుల క్రితం జరిగిన సుధీర్ బాబు ‘భలే మంచి రోజు’ ఆడియో వేడుకలో మహేష్ కు ఒక వింత అనుభవం ఎదురైంది. 

ఆ కార్యక్రమానికి మహేష్ తో పాటు రానాను కూడ అతిధిగా పిలవడంతో ఆ కార్యక్రమ ప్రాంగణంలోకి వచ్చిన రానా డైరెక్ట్ గా మహేష్ దగ్గరకు వెళ్ళి పలకరించి వంగి మహేష్ కాళ్ళకు నమస్కారం పెట్టడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఈ అనుకోని సంఘటనకు మహేష్ కూడ షాక్ అయ్యాడు. దీనితో ఆ కార్యక్రమానికి వచ్చిన అతిధులు అంతా ‘శ్రీమంతుడి’ కాళ్లకు   భల్లాలదేవుడు మొక్కాడు అంటూ కామెంట్స్ చేసుకున్నారు. ఈ అనుకోని శీను ‘భలే మంచి రోజు’ ఆడియో వేడుకకు హైలెట్ గా మారింది. 

ఈ ఆడియో వేడుకలో మహేష్ మాట్లాడుతూ ఒక సరైన హిట్ పడితే తన బావ సుధీర్ బాబు టాప్ హీరో అయిపోతాడు అన్న మాటలకు సంకేతంగా ఈ ఆడియో వేడుకనాడు విడుదలైన ధియేట్రికల్ ట్రైలర్ కు మంచి స్పందన రావడమే కాకుండా ఈసినిమా పట్ల బయ్యర్లలో మంచి ఆ శక్తి ఏర్పడింది అన్న వార్తలు వస్తున్నాయి. మహేష్ రావడంతో ఒక విధంగా ‘భలేమంచిరోజు’ మార్కెట్ కు మేలు జరిగింది అంటూ ఫిలింనగర్ లో కామెంట్లు వినపడుతున్నాయి. 

‘ప్రేమ‌క‌థాచిత్రం,'  ‘కృష్ణమ్మ క‌లిపింది ఇద్దరిని' లాంటి సినిమాల తర్వాత సుధీర్ బాబు నటిస్తున్న ‘భలే మంచిరోజు’ సినిమాలో వామిఖని హీరోయిన్‌గా పరిచ‌యం చేస్తున్నారు. ఈసినిమా ద్వారా శ్రీరామ్ ఆదిత్య అనే యువకుడు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీమంతుడు పై భల్లాల దేవుడికి అంత ప్రేమ ఏమిటో అర్ధంకాని విషయంగా మారిoది..


మరింత సమాచారం తెలుసుకోండి: