బాలకృష్ణ 99 సినిమా షూటింగ్ ముగిoపుకు చేరుకోవడంతో బాలయ్య తన 100వ సినిమా పై దృష్టి పెట్టాడు అన్న వార్తలు వస్తున్నాయి. బాలయ్య 100వ సినిమాను నిర్మాత కొర్రపాటి సాయి నిర్మిస్తాడు అని ఇప్పటికే వార్తలు వస్తున్న నేపధ్యంలో బాలయ్య బోయపాటిల కాంబినేషన్ లో సినిమాకు రంగం కూడ సిద్ధం అయింది. 

అయితే బాలకృష్ణ మనసు అనుకోకుండా ‘ఆదిత్య 369’ కు సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ చేయాలి అని కోరిక కలగడం నిర్మాత కొర్రపాటి సాయికి అనుకోని షాకింగ్ న్యూస్ గా మారింది అని అంటున్నారు. గతంలో ‘ఆదిత్య 369’ తీసిన సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సీక్వెల్ కు సంబంధించి లైన్ తయారు చేసి బాలయ్యకు వినిపించిన నేపధ్యంలో ఆ కథ బాలకృష్ణకు బాగా నచ్చడంతో దాన్నే తన 100వ సినిమాగా చేయాలని బాలయ్య ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఫిలింనగర్ టాక్.

అయితే భారీ బడ్జెట్ తో కూడుకున్న ఈసినిమాను ప్రస్తుతం 85సంవత్సరాల వయస్సు ఉన్న సింగీతం శ్రీనివాసరావు ఎంత వరకు తీయగలుగుతాడు అని కొర్రపాటి సాయి భయపడుతున్నట్లు టాక్. అయితే ఈ విషయాన్ని స్పష్టంగా బాలయ్యకు చెప్పలేక బాలయ్య మనసును ఈ సీక్వెల్ కు బదులుగా మరో సినిమాపై మనసు మళ్ళించడానికి కొర్రపాటి ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే బోయపాటి బాలయ్య కోసం ఒక స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన నేపధ్యంలో తనకు వరసగా రెండు హిట్స్ ఇచ్చిన బోయపాటి వైపు బాలయ్య మళ్ళుతాడా లేదంటే సింగీతం కథకు ఫైనల్ గా ఒకే చేస్తాడా? అనే విషయమై రకరకాల కథనాలు ఉన్నాయి. ఇంతకీ కొర్రపాటి సమస్యకు బాలయ్య సమాధానం ఏమి ఇస్తాడు అన్నది సస్పెన్స్..


మరింత సమాచారం తెలుసుకోండి: