ప్రస్తుతం మెగా యంగ్ హీరోలు అందరిలోకి అదృష్టం సాయి ధరమ్ తేజ్ వైపు ఎక్కువగా ఉంది. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ టాప్ సక్సస్ అవ్వడంతో ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో చాల సినిమాలు ఉన్నాయి. అయితే వచ్చిన విజయాలతో ఎటువంటి ఇగోను ప్రదర్శించకుండా అందరితో సరదాగా కలిసిపోతాడు అన్న కామెంట్స్ కూడ సాయి ధరమ్ కెరియర్ కు బాగా ఉపయోగ పడుతున్నాయి. 

దీనికితోడు సోషల్ మీడియాను కూడ సాయిధరమ్ తేజ్ బాగా ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడు ట్విట్స్ పెడుతూ తన అభిమానులకు అందుబాటులో ఉంటాడు ఈ యంగ్ హీరో. లేటెస్ట్ గా ఈ యంగ్ హీరో పై వెన్నెలకిషోర్ వేసిన సెటైర్ వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్య వెన్నెల కిషోర్ సాయిధరమ్ తేజ్ కోసం ఒక ఫోన్ గిఫ్టుగా తీసుకెళ్లి ఇచ్చాడట. 

అది చూసి సాయి చాలా ఎగ్జైట్ అయిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫొటోను తన ట్విట్టర్ లో పెట్టాడు. ‘‘హ్యపీ టియర్స్ అన్నా, నీలాంటి అన్నయ్యను ఎక్కడా చూడలేదు. నువ్విచ్చిన గిఫ్టుకి చాలా థ్యాంక్స్’’ అంటూ ట్వీట్ చేసాడు సాయిధరమ్ తేజ్. అయితే ఈ కామెంట్ కు చాల వెరైటీగా స్పందించాడు వెన్నెల కిషోర్. ‘ఏదో శ్రీకృష్ణుడికి అటుకులిచ్చిన కుచేలుడిలా ఉడతా భక్తిగా తాను ఈ కానుక ఇచ్చాను అంటూ సాయిధరమ్ తేజ్ పై సెటైర్లు వేసాడు వెన్నెల కిషోర్. 

అయితే వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలలో మధ్యగా వచ్చిన హరీష్ శంకర్ వీరిద్దరిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేసాడు. దీనితో ఈ సెటైర్ల రగడ వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. నటించిన సినిమాలు తక్కువే అయినా తన మేనమామ ఇమేజ్ తో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సాయి ధరమ్ తేజ్ తెలివి తేటలకు టాలీవుడ్ షాక్ అవుతోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: