ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ చర్ఛించుకుంటున్న హాట్ గాసిప్ రామ్ చరణ్ తనిఒరువన్ రిమేక్ గురించే. ఎప్పటి నుండో ఈ మూవీకి సంబంధించిన ఓ విషయం హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. తని ఒరువన్ మూవీలో హీరో కంటే విలన్ పాత్రకే డిమాండ్ ఉంది. అందుకే హీరో ఎవరన్నది పక్కన పెడితే, విలన్ ఎవరు అనేదే అందరూ తెలుసుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. ఇక రామ్ చరణ్ లాంటి బడా స్టార్ హీరోగా ఈ మూవీలో నటిస్తుండటంతో, ఈ హీరోకి సరిపోయే పవర్ ఫుల్ విలన్ ఎవరు అనేది అందరి ప్రశ్న.


ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, దసరా కానుకగా రిలీజ్ చేసిన ‘బ్రూస్ లీ’ సినిమా మెగా అభిమానులని అంతగా అలరించలేకపోవటంతో, అందరూ తనిఒరువన్ రిమేక్ పైనే శ్రద్ధ చూపుతున్నారు. ఇక రామ్ చరణ్ సరసన విలన్ గా అరవింద్ స్వామి అయితేనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని చిత్ర యూనిట్ ఫైనల్ డిస్కషన్స్ ని చేసింది. అందుకు అరవింద్ స్వామి 5 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసినట్టు టాక్స్ వినిపించాయి.


దీంతో చిత్ర యూనిట్ సైతం 5 కోట్ల రూపాయలను అరవింద్ స్వామికి ఇవ్వటానికి రెడీగా ఉన్నారనేది ఇండస్ట్రీలోని హాట్ టాపిక్. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి, అలాగే ఈ మూవీని రిమేక్ చేస్తున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి టీం నుండి వినిపిస్తన్న సమాచారం ప్రకారం, 5 కోట్ల ఆఫర్ అనేది గాసిన్ అని తేలింది. ఇంకొన్ని వివరాలను తెలుసుకోగా, అరవింద్ స్వామి ని తెలుగులోకి తీసుకోవటానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది కానీ, అందరూ అనుకున్నట్టుగా అరవింద్ స్వామికి 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అనేది కరెక్ట్ కాదంట.


అయితే అరవింద్ స్వామికి దాదాపు కోటి నుండి కోటిన్నర వరకూ రెమ్యునరేషన్ ని ఇవ్వటానికి చిత్ర యూనిట్ చర్ఛలు జరుపుతున్నట్టు క్లియర్ గా వినిపిస్తున్న టాక్స్. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ప్రీ ప్రొడక్షన్ పనులని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని డిసెంబర్ లో అధికారికంగా లాంచ్ చేసి జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇక హీరోయిన్ గా శ్రుతిహాసన్ ని కన్ఫర్మ్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: