తన నటనతో పాటు ఉన్నత భావాలతో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న అమీర్ ఒక్క చిన్న మాట నోరి జారి దేశమంతా ఛీ కొట్టేలా చేసుకున్నాడు. దేశంలో అసహనం పెరిగిపోతుందని తన భార్య దేశం విడిచి వెళ్లాలంటుందని నోరు జారిన అమీర్ తను కలలో కూడా ఊహించనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ సెలబ్రిటీస్ నుండి రాజకీయ నాయకుల దాకా ఇదే హాట్ టాపిక్.


అయితే ఈ విషయం గురించి సంబంధం లేని భార్యా భర్తలిద్దరు గొడవ పడి ప్రాణాలను కోల్పోయే పరిస్థితి వచ్చింది. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ కి చెందిన అయంక్ పాండే తన భార్య సోనల్ తో స్థానిక అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. అయితే అమీర్ ఖాన్ వ్యాఖ్యలకు భర్త సపోర్ట్ చేయగా తీవ్రమైన ఒత్తిడికి గురై తట్టుకోలేక విషం తాగేసిందట. విషయం గుర్తించిన ఆమె భర్త దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లే లోపే ఆమె మృత్యువాత పడ్డది. 


సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు వారు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడితే ఇలాంటి ఘోరాలు జరిగే అవకాశం ఉండదు. దీన్ని అమీర్ ఏవిధంగా సమర్ధించుకుంటారో చూడాలి. ప్రస్తుతం అమీర్ ఖాన్ పై దేశమంతా రాగద్వేషాలు కురిపిస్తుందని నిజం. మరి పరిస్థితి నుండి అమీర్ ఎలా బయటపడతాడో చూడాలి.


ప్రస్తుతం అందరి టార్గెట్ బాలీవుడ్ హీరో అమీర్ ఖానే. అయితే ఇంతలా జరుగుతుందని ఊహించని అమీర్ తన కుటుంబం ఇండియాలోనే ఉంటుందని తన మాటలని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. అయినా మాట్లాడేటప్పుడు ఆలోచిస్తే ఇంత గొడవ జరిగి ఉండేది కాదు కదా.. విషయం ఏంటంటే సత్యమేవ జయతే అంటూ ప్రోగ్రాం చేస్తున్న అమీర్ ఇలాంటి దురహంకార మాటలు మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆన్లైన్ మార్కెటింగ్ సైట్ స్నాప్ డీల్ కూడా తమ హోస్ట్ గా అమీర్ ని తీసేస్తున్నట్టు ప్రకటించడం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: