సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమా బ్రహ్మోత్సవం.. ఆ సినిమా తర్వాత మురుగదాస్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు మన ప్రిన్స్. అయితే సినిమా కన్ఫాం అని తెలిసినప్పటి నుండి దాస్, మహేష్ ల సినిమా ఎలా ఉండబోతుందని ఒకటే ఆత్రుత మొదలైంది అభిమానుల్లో. ఇప్పటికే సినిమా బడ్జెట్ 110 కోట్లని స్టన్ అయ్యేలా చేసిన వీరు సినిమా ఇంకెంత ట్రెండ్ సెట్ చేయనున్నారో అనిపిస్తుంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండటం విశేషం.


ఇక సినిమా న్యాయ వ్యవస్థకు సంబధించిన కాన్సెప్ట్ బేస్ తో నడుస్తుందని ఇదవరకే తెల్సింది. అయితే ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న మరో ఎక్స్ క్లూజివ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో మహేష్ డ్యుయల్ చేయనున్నాడని.. అవును మురుగదాస్ సినిమాల్లో చాలా మంది హీరోలు డ్యుయల్ రోల్ చేసినవారే.. వారి దారిలోనే మురుగదాస్ మహేష్ ని కూడా ద్విపాత్రాభినయం చేసేలా చూస్తున్నాడట. మహేష్ డ్యుయల్ రోల్ అంటే ఫ్యాన్స్ కూడా సూపర్ ఎగ్సైటింగ్ లో ఉన్నారు.


నాని సినిమాలో చివరన కొద్దిసేపు డ్యుయల్ రోల్ చేసిన మహేష్ మళ్లీ డ్యుయల్ రోల్ సినిమాలు చేయలేదు. కథ డిమాండ్ మేరకే అలాంటి సినిమాలు ఒప్పుకోవాలని మహేష్ ఆలోచన.. అదీగాక సినిమాలో డ్యుయల్ రోల్ అంటే రెండు పాత్రలకు చాలా వేరియేషన్స్ చూపించే స్కోప్ ఉండేలా చూసుకుంటేనే బెటర్. అయితే ప్రస్తుతం అలాంటి ఫీట్లు మహేష్ చేయలేదు. రెగ్యులర్ గా వచ్చే డ్యుయల్ రోల్ అని కాకుండా సంథింగ్ స్పెషల్ గా ఉండే రోల్ అయితే బెటర్ అని ఇన్నాళ్లు ఆగాడు. 


పారస్ జైన్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్న ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా ఏప్రిల్ 8న స్టార్ట్ చేస్తారని టాక్. మరి డ్యుయల్ రోల్లో మహేష్ ఏవిధంగా అలరిస్తాడో చూడాలి. మురుగదాస్ సినిమాల్లో సామాజిక్ అంశాలు చాలా ప్రస్థావనకు వస్తాయి మరి సమాజం కోసం మహేష్ సినిమా ద్వారా నడుం కట్టడం మంచి విషయమే అని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: