టాలీవుడ్ కి చెందిన టాప్ హీరోయిన్స్ సైతం మైండ్ గేమ్ లను బాగానే నేర్చుకున్నారు. తాజాగా జరిగిన ఓ పరిణామం ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్స్ ప్రకారం, టాప్ హీరోయిన్ సమంత ఎన్టీఆర్ కి గుడ్ న్యూస్ చెప్పి, చరణ్ కి షాకింగ్ ఇచ్చిందట. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సమంతల కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. సమంత ఎవరికైనా కాల్షీట్స్ లేవు అనే సమాధానం చెబుతుందేమో కానీ, ఎన్టీఆర్ సరసన నటించాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా నో అనే ప్రసక్తే రానివ్వదు.


వీరి కాంబినేషన్ లో వచ్చిన బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలు బాక్సాపీస్ వద్ద అలరించాయి. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ, వీరి కాంబినేషన్ మాత్రం సిల్వర్ స్క్రీన్ పై బాగా పండిందనే అంటారు. ఇక తాజాగా ఎన్టీఆర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ తో తెరకెక్కుతుంది. ఈ మూవీకి సంబంధించిన స్టార్ కాస్టింగ్ ని ఫైనల్ చేసే దిశగా చిత్ర యూనిట్ పనులను వేగవంతం చేసింది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్‌ సరసన నటించేందుకు సమంతని ఓకే చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.


ఇందుకు సమంత సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ బ్యూటీని కొరటాల శివ సంప్రదించిన వెంటనే  ఏ మాత్రం ఆలోచించకుండా ఈ ప్రాజెక్టును ఓకే చేసేశారంట. కేవలం ఎన్టీఆర్ హీరో అని చెప్పగానే కథని సైతం వినకుండా ఓకె చెప్పటంతో, కొరటాల శివ సైతం షాక్ అయ్యాడంట. ఇదిలా ఉంటే ఈ విషయం రామ్ చరణ్ కి షాకింగ్ గా మారింది. రామ్ చరణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ అయిన తనిఒరువన్ తెలుగు రిమేక్ లో మొదట హీరోయిన్ గా సమంతనే అప్రోచ్ అయ్యారంట.


అందుకు సమంత, తను బిజిగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. దీంతో చిత్ర యూనిట్ శ్రుతిహాసన్ ని అప్రోచ్ అయ్యారు. తని ఒరువన్ తెలుగు రిమేక్, కొరటాల శివ సినిమా రెండు ఒకే సమయంలో షూటింగ్ ని జరుపుకోనున్నాయి. కానీ, మొదటగా అప్రోచ్ అయిన చరణ్ టీంకి సమంత నో చెప్పి, తరువాత వచ్చిన ఎన్టీఆర్ టీంకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రామ్ చరణ్ షాకింగ్ అయినట్టుగా తెలుస్తుంది.  దీంతో ఎన్టీఆర్ అంటే సమంతకి ఎంత అభిమానమో తెలుస్తుందని అంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తోన్న ‘నాన్నకు ప్రేమతో’ పూర్తయ్యాక కొరటాల శివ సినిమాలో నటించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: