గత మూడు సంవత్సరాల నుండి దేవిశ్రీ ప్రసాద్ పై వస్తున్న గాసిప్స్ కి ఎట్టకేలకు తెరపడింది. అయితే తను తొలిసారి హీరోగా కనిపిస్తున్న చిత్రం స్ట్రయిట్ చిత్రమా? లేక రిమేక్ చిత్రామా? అనే డౌట్ అందరిలోనూ ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలపై ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న న్యూస్ ని చూస్తే, మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన సంగీతంతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌.


అయితే దేవీశ్రీ ప్రసాద్, హీరోల ఆడియో ఫంక్షన్స్ లో చేసే హంగామా...ఏ హీరోల ఎన్టర్జీతో సరిపోదు. రెట్టింపు ఉత్సాహంతో అందరిని పరుగులు పెట్టిస్తుంటాడు. దీంతో చాల మంది దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా చేయమంటూ సలహాలు ఇస్తున్నారు. కొంత మంది అయితే దేవిశ్రీ ప్రసాద్ ఒప్పుకుంటే భారీ బడ్జెట్ ఫిల్మ్ ని తీస్తామని అటు నిర్మాతలు, ఇటు దర్శకులు తనపై ఒత్తిడిని సైతం తీసుకువచ్చారు. ఇంత కాలం తరువాత దేవిశ్రీ, తను హీరోగా చేయబోతున్న ప్రాజెక్ట్ పై క్లారిటిని ఇచ్చాడు. 


‘కుమారి 21 ఎఫ్’ సక్సెమీట్‌లో దేవిశ్రీప్రసాద్‌ను హీరోగా పరిచయం చేస్తున్నానని ‘దిల్’రాజు ప్రకటించాడు. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన విశేషాలను తెలియజేశాడు. ‘దేవిశ్రీప్రసాద్‌కు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో‘నేను నటించ దగ్గ కథ కుదిరితే హీరోగా నటిస్తానని’ దేవి చెప్పాడు. అందుకే అతన్ని మా సంస్థ ద్వారా హీరోగా పరిచయం చేయబోతున్నాను. 12 ఏళ్ల క్రితం ‘ఆర్య’తో ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్‌ ని అందించిన అదే టీమ్‌తో ఈ సినిమా చేయబోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.


ఇక ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తే, రత్నవేలు ఫోటోగ్రఫి అందించనున్నారు. అయితే సుకుమార్ ఈ మూవీని హిందీలో వచ్చిన ఓ మూవీకి రిమేక్ గా తెరకెక్కించనున్నారంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. హిందీలో 2007లో వచ్చిన ఆఫ్ కా సురూర్ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. ఇందులో సింగర్ గా ఉన్న హిమేష్ రేషమ్మియా హీరోగా నటించాడు. సరిగ్గా ఈ కాన్సెక్ట్ తోనే సుకుమార్ సైతం, దేవిశ్రీని హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే ఆఫ్ కా సురూర్ మూవీ రిమేక్ పై రైట్స్ ని తీసుకున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: