సిద్ధార్థ సమంతల ప్రేమ వ్యవహారం బ్రేకప్ అయిన తరువాత వీరిద్దరు ఒకరి పై ఒకరు కామెంట్స్ చేసుకున్న సందర్భాలు లేవు. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని లేటెస్ట్ గా ఈమజీ ప్రేమికులు ఇద్దరు ట్విటర్ వేదికగా చేసుకుని చాల ఘాటైన కామెంట్స్ చేసుకున్నారు. ‘గతంలో నీకు జరిగిన చెడు అంతా నీ మంచికే జరిగిందని తెలుసుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది’ అంటూ సిద్ధార్థ తన ట్విట్టర్‌లో చేసిన ఓ పోస్ట్‌కు ఘాటుగా స్పందించింది సమంత.

‘నువ్వు ఒక పరిచయమే గుర్తులేనంతగా మారిన మామూలు వ్యక్తివని నేను భావిస్తున్నాను’ అంటూ సిద్ధార్థకు కౌంటర్ ఇచ్చింది సమంతా. అయితే ఎందుకు భయపడిందో తెలియదు కాని సమంత తన ట్విటర్ ఎకౌంట్ నుండి ఆ ట్విట్ ను డిలీట్ చేసింది. అయితే ఎప్పుడో విడిపోయిన వీరిద్దరూ మళ్ళీ ఒకరి పై ఒకరు ఎందుకు ఇంత ఘాటుగా కామెంట్ చేసుకున్నారు అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది. 

సమంతతో బ్రేకప్ అయిన తరువాత సిద్దార్థ్ తన సినిమాల వేగం పెంచడమే కాకుండా కోలీవుడ్ చాల వెరైటీ సినిమాలలో నటిస్తున్నాడు సిద్ధార్థ్. ఈ నేపధ్యంలో సిద్ధార్థ్ కోలీవుడ్ బ్యూటీ త్రిషతో కలిసి ‘అరన్మణై 2’ సినిమాలో నటిస్తున్నాడు. ఈమధ్యనే వీరిద్దరి పై ఒక రాత్రివేళ మద్రాసు బీచ్ లో ఒక రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరించారు. అయితే ఈ పాట చిత్రీకరణతో పాటు వీరిద్దరి మధ్యా ఈసినిమా మూలంగా సాన్నిహిత్యం పెరిగింది అంటూ కోలీవుడ్ మీడియా గాసిప్పులు వ్రాస్తోంది.

ఈ గాసిప్పులు సమంత దృష్టిలో పడి ఉంటాయి. అందుకే కోపం వచ్చి సిద్ధార్థ్ పై ఇలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది అనుకోవాలి. ఈ ప్రేమికులు ఇద్దరూ విడిపోయినా ఎవరికీ వారికి కోలీవుడ్ లో వరస పెట్టి అవకాశాలు రావడం అందర్నీ ఆశ్చర్య పరిచే విషయం. ఏది ఎలా ఉన్నా వీరిద్దరి వెబ్ వార్ హాట్ న్యూస్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: