తెలుగు చిత్ర పరిశ్రమలోకి బాలీవుడ్ హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం సహజం.. అయితే ఎవరు స్థిరంగా కొనసాగలేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మోడల్ రకూల్ ప్రితి సింగ్ తర్వాత వచ్చిన లౌక్యం, కరెంట్ తీగ లాంటి హిట్ సినిమాలతో మంచి ఫామ్ లోకి వచ్చింది. రామ్ సరసన పండగ చేస్కో సినిమా కూడా మంచి హిట్ సాధించినా.. కిక్ 2, బ్రూస్ లీ   చిత్రాలు అట్టర్ ప్లాప్ కావడంతో ఈ అమ్మడు నిరాశ పడింది.

ఈ సినిమాలు అపజయం పొందినా తన ఇమేజ్ కి ఏమాత్రం డ్యామెజ్ కాలేదు. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు మరో మెగా చాన్స్ కొట్టేసింది. మెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ఇప్పటికే రెండు చిత్రాలు ముకుందా, కంచె సూపర్ హిట్ సాధించాయి.

రకూల్ ప్రితి సింగ్


తాజాగా పూరీ జగన్నాథ్ తో లోఫర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో రకులే హీరోయిన్ గా ఫిక్సయింది.  గోపీచంద్ దర్శకత్వంలో ఇప్పటికే ‘పండగ చేస్కో’ చేసింది. ఆ సినిమాలో రకుల్ పెర్ఫామెన్స్ నచ్చడంతో గోపీ ఆమెకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. మరి వరుణ్ తేజ్ తో జోడీ కడుతున్న ఈ భామ మరోసారి సక్సెసాధిస్తుందా లేదా వేచి చూడాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: