కమెడియన్ టర్నెడ్ హీరోగా అవతరించిన సునీల్ కెరియర్ ఏమాత్రం బాగాలేదని చెప్పొచ్చు. కమెడియన్ గా ఫుల్ క్రేజ్ సంపాధించిన కుర్రాడు ఎప్పుడైతే హీరో అయ్యాడో ఆ ఆఫర్లన్ని పోయాయి సరికదా తనని హీరోగా పెట్టి సినిమా చేసే వాళ్లు కరువయ్యారు. ప్రస్తుతం రెండు సినిమాలు తీస్తున సునీల్ వాటి మీద తన ఆశలన్ని పెట్టుకుని ఉన్నాడు. అయితే భీమవరం బుల్లోడు అని వచ్చి రెండు సంవత్సరాలు కావొస్తున్నా సునీల్ ఒక్క సినిమా కూడా చేయకపోయే సరికి మనవాడి పని అయిపోయింది అనుకున్నారంతా..


ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో కృష్ణాష్టమి సినిమా చేస్తున్న సునీల్ ఆ సినిమా మీదే ఆశలన్ని పెట్టుకున్నాడు. జోష్ ఫేం వాసు వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో యాక్షన్ హీరోగా అవతరించాడు సునీల్. ట్రైలర్ తో అదరగొట్టిన సునీల్ సినిమా ఎలాగైనా సక్సెస్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. అయితే ఈ దారిలోనే తనకు స్టార్ రైటర్ గోపీ మోహన్ ఇచ్చిన ఆఫర్ ని కూడా రిజక్ట్ చేశాడు. స్టార్ రైటర్ అయిన గోపీ మోహన్ తను సునీల్ కోసం అద్భుతమైన కథ రెడీ చేసుకుని అతనితో డిస్కస్ కూడా చేశాడు. సినిమా కచ్చితంగా చేస్తా అని చెప్పిన సునీల్ ఎంతకీ చేయకపోయే సరికి చిరాకు పుట్టిన గోపీ ఓ కుర్ర హీరోతో అదే సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.


కృష్ణాష్టమి సినిమాలో సునీల్ :


గోపీ సునీల్ కి షాక్ ఇచ్చి కుర్ర హీరోని పెట్టుకుని సినిమా తీయడానికి కారణం సునీలే అని ఫిల్మ్ నగర్ టాక్. ఇటు కమిట్ అయిన సినిమాల గురించి ఆలోచిస్తూ సునీల్ గోపీని నెగ్లెక్ట్ చేయడం సహించని గొపీ అవమానం భరించలేక సినిమా సునీల్ తో కాన్సిల్ చేసి కుర్ర హీరోతో చేస్తున్నాడు. ఆ సినిమా న్యూస్ ఇంకొద్దిరోజుల్లో బయటకు వస్తుంది. ప్రస్తుతం రైటర్ గా కొన్సాగిస్తూనే కో ప్రొడ్యూస్ చేస్తున్న కోనా వెంకట్ లానే సినిమా డైరక్షన్ వైపు అడుగులేస్తున్నాడు గోపీ మోహన్. మరి ఈ స్టార్ రైటర్ చేసే ఈ సినిమా ఎలాంటి అవుట్ పుట్ ఇస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: