చిరంజీవికి తగులుతున్న షాక్ ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు మెగా హీరోల సినిమా ఆడియో ఫంక్షన్స్ కు చిరంజీవి కాకుండా బయట హీరోలు అతిధులుగా వచ్చిన సందర్భాలు లేవు. మెగా ఆడియో వేడుకలలో వీలైనంత వరకు చిరంజీవిని లేదంటే రామ్ చరణ్ ను అతిధులుగా పిలుస్తూ ఆడియో ఫoక్షన్స్ నిర్వహిస్తూ వచ్చారు. మెగా అభిమానులు కూడ మెగా ఈ వెంట్స్ వేదిక పై వేరే టాప్ హీరోలను చూసి ఈలలు కొట్టిన సందర్భాలు లేవు.

అయితే ఇప్పుడు ఆ సాంప్రదాయానికి చెక్ పడబోతోంది. పూరి జగన్నాథ్ చిరంజీవి కలలో కూడ ఊహించని ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పూరి మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ తో నిర్మించిన ‘లోఫర్’ ఆడియో ఫంక్షన్ కు ప్రభాస్ ను ముఖ్య అతిధిగా పిలిచినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక మెగా యంగ్ హీరో సినిమా ఆడియోను వేరే హీరో లాంచ్ చేయడం ఇదే మొదటిసారి.

ఈ ఆడియో వేడుక డిసెంబర్ 7న శిల్పకళా వేదికలో జరగబోతోంది అని తెలుస్తోంది. కనీసం ఈ ఫంక్షన్ కు సంబంధించి మర్యాదపూర్వకంగా చిరంజీవికి పిలుపు కూడ లేదు అని ఫిలింనగర్ టాక్. చిరంజీవితో పూరి తీద్దాము అనుకున్న ‘ఆటోవాల’ స్క్రిప్ట్ తనకు నచ్చలేదు అన్న విషయాన్ని చిరంజీవి తనకు చెప్పకుండా తన పేరు పెట్టి చిరంజీవి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పిన విషయానికి షాక్ అయిన పూరి దానికి బదులుగా ఈ మెగా షాక్ చిరంజీవికి ఇచ్చాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఈ ఆడియో ఫంక్షన్ కు సంబంధించి ఒక్క నాగబాబుకు తప్ప మరే మెగా కుటుంబ హీరోకు ఆహ్వానం అందలేదు అని తెలుస్తోంది. అయితే ఈ షాక్ ను పూరి ఒక్కడే ఇచ్చాడా? లేదంటే నాగబాబుకు తెలియచేసి పూరి వ్యూహాత్మకంగానే షాక్ ఇచ్చాడా అనే విషయం పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈమధ్య జరిగిన నిహారిక సినిమా ప్రారంభానికి ఒక్క నాగబాబు కుటుంబ సభ్యులు తప్ప మరి మెగా కుటుంబ సభ్యులు ఎవ్వరూ రాని నేపధ్యంలో మళ్ళీ చిరంజీవి లేకుండానే మరో మెగా ఈవెంట్ జరగబోతూ ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది..
 


మరింత సమాచారం తెలుసుకోండి: