‘బ్రూస్ లీ’ ఘోర పరాజయం తరువాత కొన్ని కుటుంబ సమస్యలలో చిక్కుకున్న శ్రీనువైట్ల ఆ సమస్యలు అన్ని పరిష్కరించుకుని తిరిగి తానూ చేయబోయే సినిమాల పై దృష్టి పెట్టాడు. ఇప్పటికే శ్రీనువైట్లతో సినిమా చేయడానికి హీరో విష్ణు, రామ్ లు అంగీకరించారు అని  వార్తలు వస్తున్న నేపధ్యంలో లేటెస్ట్ గా ఈలిస్టులోకి రానా కూడ వచ్చి చేరాడు అని ఫిలింనగర్ టాక్. అయితే ఈవార్తలు ఇలా ఉండగా శ్రీనువైట్ల రేపు మహేష్ బాబును కలవడానికి మహేష్ అపాయింట్ మెంట్ దొరికింది అన్న వార్తలు చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. 

మహేష్ తో ‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ తీసి మహేష్ రేంజ్ ని విపరీతంగా పెంచిన శ్రీనువైట్ల అంటే మహేష్ కు చాలా గౌరవం అన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఆగడు’ ఘోర పరాజయం చెందినా మహేష్ శ్రీనువైట్లకు వ్యతిరేకంగా ఒక్క కామెంట్ కూడా తన సన్నిహితుల దగ్గర చేయలేదు అని అంటారు. ఈ పరిస్థుతుల నేపధ్యంలో శ్రీనువైట్ల మహేష్ ను ఎందుకు కలుస్తున్నాడు అంటూ తెగ చర్చలు ఫిలింనగర్ లో జరుగుతున్నాయి. 

ప్రస్తుతం మహేష్ వరస భారీ సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. మహేష్ నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ తరువాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా మురగదాస్ ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్. దీనివల్ల  శ్రీనువైట్ల ఎంత అద్భుతమైన కథ చెప్పినా 2017 వరకు మహేష్ ఖాళీగా లేడు. ఈ నేపధ్యంలో వీరిద్దరు దేని గురించి మాట్లాడుకుంటారు అన్న ఆశక్తి చాలా మందిలో ఉంది. అయితే ఈమధ్యనే తన సొంత నిర్మాణ సంస్థను కూడ ప్రారంభించిన మహేష్ కొంత మంది పెద్ద దర్శకులచేత చిన్న బడ్జెట్ సినిమాలను  నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనికి అనుగుణంగా ఒక చిన్న హీరోతో మహేష్ సొంత బ్యానర్ లో సినిమా చేసే విషయాన్ని మహేష్ తో మాట్లడానికే వీరిద్దరి భేటీ జరగబోతోంది అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం శ్రీనువైట్ల మహేష్ ల మధ్య జరగాబోతున్న మీటింగ్ హాట్ టాపిక్ గా మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: