టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్స్ కి సంబంధించిన హడావిడి నడుస్తుంది. ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు ముదురు హీరోయిన్స్ పెత్తనం చెలాయిస్తున్నప్పటికీ, కొత్త హీరోయిన్స్ తాకిడి కూడ ఎక్కువుగానే ఉంటుంది. దీంతో ముదురు హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ కి తట్టుకోలేకపోతున్న నిర్మాతలు, కొత్త హీరోయిన్స్ కి కొత్త అవకాశాలను ఇస్తున్నారు.


ఆ విధంగా ప్రస్తుతం టాలీవుడ్ కి ఎంట్రి ఇచ్చిన కొత్త హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్,  తాజాగా కొత్త ఆఫర్స్ ని చేజిక్కించుకుంటుంది. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ‘కంచె’ సినిమాలో హీరోయిన్‌గా నటించి అందరి ప్రశంసలను పొందిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. కంచె మూవీతో దాదాపు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖల అందరి మన్ననలను పొందింది. దీంతో టాప్ హీరోలు సైతం ప్రగ్యా జైస్వాల్ ని హీరోయిన్ గా తీసుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు.


తాజాగా మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో నటించే అవకాశం ప్రగ్యా జైస్వాల్  కు దక్కడం హాట్స్ టాక్స్ గా నిలిచింది. దిల్‌రాజు నిర్మాణంలో రవితేజ హీరోగా వస్తున్న ‘ఎవడో ఒకడు’ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే ఓ హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ ని సెలక్ట్ చేయగా, ఈ ప్రాజెక్ట కోసం తాజాగా ప్రగ్యా జైస్వాల్ కి కన్ఫర్మ్ చేశారు.


వరుణ్ తేజ్ సరసన నటించిన ఈ బ్యూటీకి ఆఫర్స్ రావటం వెనుక మెగా కాంపౌండ్ ప్రోత్సాహం కూడ ఉందని అంటున్నారు. ఇక  ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ బ్యూటీకి రామ్ చరణ్ సరసన సైతం ఆఫర్ ని చేజిక్కించుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: