ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాడ్ టైం స్టార్ట్ అయిందంటే, దాని ఎఫెక్ట్ మాములుగా ఉండదు. నేనే టాప్.. అనే భావన ఎప్పుడైతే ఫిల్మ్ సెలబ్రిటీలకు వచ్చిందో, ఇండస్ట్రీ వారి తాట తీస్తుందని అందరూ అంటుంటారు. అయితే పెద్ద వర్గానికి చెందిన వారికి ఇవన్నీ వర్తించవు. కేవలం ఎదురుగుతున్న వర్గం, సపోర్ట్ లేని ఎదిగిన వర్గానికి మాత్రమే ఇటువంటి షరుతులు వర్తిస్తాయి. ఇదిలా ఉంటే తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాడ్ టైంని చూస్తున్న క్రేజీ డైరెక్టర్ శ్రీనువైట్ల. శ్రీనువైట్ల చేసిన వరుస ప్రాజెక్ట్స్ బాక్సాపీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్స్ చూడంతో, ఈ డైరెక్టర్ కి ప్రస్తుతం అవకాశాలు దూరం అయ్యాయి.


ఇక తనకు బాగా పేరు తెచ్చిపెట్టిన రెడీ మూవీకి సీక్వెల్ ని చేపట్టే ప్రయ్నతం చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం రామ్ సైతం శ్రీనువైట్లకి షాక్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. తను నటించిన ‘శివమ్’ సినిమా బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ ని చూడటంతో, అప్ కమింగ్ మూవీ ‘నేను శైలజ’ మూవీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు.


స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో జరుగుతున్న ఈ సినిమా పకడ్భంధీగా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీ తరువాత శ్రీనువైట్లతో రెడీ మూవీ సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఈ సీక్వెల్ కి కూడ బ్రేక్ పడిందని అంటున్నారు. శ్రీనువైట్ల రెడీ చేసిన రెడీ సీక్వెల్ స్క్రీప్ట్ లో పలు సీన్స్ వీక్ గా ఉన్నాయంటూ రామ్  అభిప్రాయపడ్డాడంట. దీంతో కొత్త సీన్స్ ని శ్రీనువైట్ల రాసుకుంటున్నాడు. ఈ గ్యాప్ లో రామ్ మరోమూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.


కందిరీగ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో జత కట్టనున్నారు. దర్శకుడు శ్రీనువైట్ల కంటే ముందుగానే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళనుంది. దీంతో శ్రీనువైట్లకి బాగా లాంగ్ గ్యాప్ ఇచ్చినట్టుగా అయింది. కథపై పక్కా వర్కౌట్స్ చేసిన తరవాత రెడీ సీక్వెల్ ని భారీగా తెరకెక్కిద్దామని శ్రీనువైట్లకి రామ్ చెప్పాడంట. దీంతో శ్రీనువైట్ల రెడీ చేసుకుంటున్న రెడీ సీక్వెల్ స్క్రీప్ట్ మరో 8 నెలల తరవాతనే సెట్స్ మీదకు వెళ్ళాల్సి ఉంది. సరిగ్గా మరో నెలరోజుల్లో సెట్స్ పైకి వెళ్ళాల్సిన రెడీ సీక్వెల్ , చివరి నిముషంలో రామ్ సూచించిన మార్పులకి శ్రీనువైట్ల షాకింగ్ అయ్యాడంట.



మరింత సమాచారం తెలుసుకోండి: