టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు రాజకీయాలపైనా సామాజిక విషయాలపైనా ఎక్కువగా మాట్లాడడు. అయితే భార్యభర్తల అనుబంధం పై మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత ఆశక్తి దాయకంగా ఉన్నాయి. తమ భార్యలపట్ల విధేయులుగా ఉండని భర్తలు ఫూల్స్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు మహేష్. ఎంతో పరిణతి చెంది వివేకవంతులైన భర్తలు తమ భార్యలపట్ల అణకువగా విధేయులుగా ఉంటారని తన అభిప్రాయాన్ని చాలస్పష్టంగా వ్యక్తపరిచాడు మహేష్ బాబు. 

కుటుంబం అంటే పేరెంట్స్ భార్య పిల్లలు అన్నభావం తనకు ఎక్కువ అని అంటూ తనతండ్రి సూపర్‌స్టార్ కృష్ణ నుండి తాను ఎంతోనేర్చుకున్నాను అని అంటూ తన పై తనతండ్రి ప్రభావాన్ని వివరించాడు. చెన్నైలో పుట్టిన తనబాల్యo అంతాఅక్కడే గడిచిపోవడంతో తాను ఒకసూపర్ స్టార్ కొడుకుని అనే విషయం తాను చదువుకునే స్కూల్ లో టీచర్లకు కూడ తెలియదని అంటూ తను ఎంత సింపుల్ గా జీవితాన్ని కొనసాగించాడో వివరించాడు మహేష్. 

ఇదేసందర్భంలో తనతో నటించే హీరోయిన్స్ తో తన సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ సినిమా షూటింగ్ స్పాట్ వరకు మాత్రమే తాను తన హీరోయిన్స్ తో సన్నిహితంగా ఉంటానని షూటింగ్ ముగిసిన తరువాత కనీసం తన హీరోయిన్స్ ఫోన్స్ చేసినా తాను లిఫ్ట్ చేయను అనిఅంటూ మరొక విషయాన్ని బయటపెట్టాడు మహేష్. తన పై ఎవరైనా కామెంట్స్ చేసినప్పుడు పైకి నవ్వుతూ తాను కనిపించినా ఆ విషయం పై తన అంచనాలు తనకు మైండ్ లోనే ఉంటాయని అయితే తన భార్య నమ్రత మాత్రం ఆ కామెంట్స్ కు పట్టించుకోనట్లు కనిపించినా ఆ కామెంట్స్ పై తెగ ఆలోచిస్తూ టెన్షన్ పడుతుందని తమ భార్యభర్తల అనుబంధాన్ని వివరించాడు మహేష్. 

అయితే ‘పోకిరి’ విడుదల తరువాత 3సంవత్సరాలు తనసినిమాలు అన్నీ ఫెయిల్ అయిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ తన జీవితంలో ఆ 3 సంవత్సరాలు ఒక పీడకల అంటూ గతాన్ని గుర్తుకు చేసుకున్నాడు మహేష్. తాను ఈరోజు ఈస్థాయిలో ఉన్నాను అంటే అదితన వారసత్వం వలెనే అనిఅంటూ తన సినిమాలు హిట్ అయినప్పుడు తనతండ్రి కళ్ళల్లో చూసే ఆనందాన్ని మళ్ళీమళ్ళీ చూడటానికై అయినా తన సినిమాలు వరస హిట్స్ గా మారాలి అని కోరుకుంటున్నాను అంటూ  భార్యాభర్తల అనుబంధం మరియు కుటుంబ బంధాల పై ఎన్నో విషయాలను ఒక ప్రముఖ జాతీయ పత్రికతో షేర్ చేసుకున్నాడు ప్రిన్స్ మహేష్..


మరింత సమాచారం తెలుసుకోండి: