ఆమధ్య పవన్ గురించి తాను ఇక భవిష్యత్ లో ఎప్పుడు మాట్లాడను అని చెప్పిన రేణు దేశాయ్  తన మాట తప్పింది. రేణుకు ఉన్న అనేకమైన మంచి అలవాట్లలో బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం. అంతేకాదు తాను  కొన్న పుస్తకాలను పదిలంగా దాచుకునే అలవాటు కూడ రేణూకు ఉంది. మరొక ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే తాను  ప్రేమతో కొనుక్కున్న ఆ పుస్తకాల  మొదటి పేజి పై తన కామెంట్ కూడ రాస్తుంది ఈమె. 

ఎప్పుడూ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే రేణూ రీసెంట్ గా ఓ ట్వీట్ చేసింది. ఒక ఫోటోని షేర్ చేస్తూ ‘నేను నా పుస్తకాలను మార్కింగ్ చేసే విధానం ఇది. ఇలా చేయడంతో వాటిని మళ్లీ చదివేటప్పుడు అప్పటి జ్ఞాపకాలు మళ్లీ గుర్తొస్తాయి’ అని రాసింది రేణు దేశాయ్. ఈ ట్వీట్ తో పాటు ఆ పుస్తకాన్ని తాను  దానిపై రాసుకున్న అప్పటి రాతలను కూడా ఫోటో తీసి వెబ్ మీడియాలో పెట్టింది రేణూ దేశాయ్.

 ఆ పుస్తకం పై తన సంతకంతో పాటు కొన్న ప్లేస్ కి గుర్తుగా చెన్నై అని రాసుకుంది రేణు. అంతేకాదు తాను పుస్తకం కొన్న డేట్ తో పాటు ‘కొమరం పులి’ షూటింగ్ టైంలో అని కూడా మెన్షన్ చేసుకుంది. రేణు దేశాయ్ ఇప్పుడు బాగా గుర్తుకు వస్తున్న  ఆ పుస్తకం పేరు ‘త్రూ ఏ గ్లాస్ డార్క్ లీ’. ఇప్పుడు ఆ పుస్తకాన్ని మళ్ళి ఓపెన్ చేస్తే తాను పవన్ తో కలిసి చెన్నైలో చక్కర్లు కొట్టిన సంగతులు గుర్తుకొస్తున్నాయని పవర్ స్టార్ ను గుర్తుకు చేసుకుంటూ ట్విట్ చేసింది రేణు దేశాయ్.

విడిపోయినా పవన్ పై ఇంత అభిమానం ఉంది కాబట్టే ఆ మధ్య పారిస్ లో ఉగ్రవాదుల బాoబు దాడులు జరిగినప్పుడు ఆ సంఘటనలకు దగ్గరలో ఉన్న రేణు ఎలా ఉందో అని మొట్టమొదట రేణుకి పవన్ ఫోన్ చేసాడు అని అంటారు. ఏమైనా ఈసారి రేణు తన పవన్ జ్ఞాపకాలను ఈ పుస్తకం ద్వారా గుర్తుకు తెచ్చుకుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: