నందమూరి మెగా కుటుంబాల నుండి వచ్చిన హీరోల సంఖ్య బాగా పెరిగి పోవడంతో అప్పటి దాకా ఒకటిగా ఉన్న నందమూరి మెగా అభిమానులు వర్గాలుగా విడిపోయారు. బయటికి ఈ కుటుంబాలు ఈ వార్తలను ఖండిస్తున్నా వాస్తవానికి మాత్రం ఇది నిజం అన్న విషయం ఆ కుటుంబాల నేపధ్యo  నుండి వచ్చిన హీరోలకు తెలుసు. అయితే అటువంటి ప్రమాదం అక్కినేని కుటుంబం పై పడకూడదు అని నాగార్జున నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. 

అక్కినేని నట వారసుడిగా సినిమా రంగంలో తన హవాను కొనసాగిస్తున్న నాగార్జున అక్కినేని అభిమానులకు చిరునామాగా మారాడు. అయితే అదే అక్కినేని కుటుంబం నుండి యంగ్ హీరోలుగా నాగచైతన్య అఖిల్ లు వరస పెట్టి సినిమాలు చేస్తూ ఉండటంతో అక్కినేని ఫ్యాన్స్ చైతూ ఫ్యాన్స్ – అఖిల్ ఫ్యాన్స్ గా రెండు వర్గాలుగా విడి పోకుండా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుండే నాగార్జున తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని టాక్.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం నాగ్ ఇప్పటి నుండే  తన ఇద్దరి పిల్లల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న ఫీలింగ్ రాకుండా నాగార్జున చాల తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఫిలింనగర్ టాక్. అఖిల్ సినిమాలో ‘కన్నెకొట్టరో పాల పిట్టరో’ పాటను రీమిక్స్ చేయాలని అనుకున్నాడట వినాయక్. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున ఆ పాటను చైతూ సినిమాలో రీమిక్స్ చేసుకోవడానికి మాట ఇచ్చాను అని అనడంతో వినాయక్ ‘అఖిల్’ సినిమాకు సంబంధించి కేవలం ఒకటి రెండులైన్లు మాత్రమే వాడుకున్నట్లు టాక్. 

అదేవిధంగా ‘అఖిల్’ సినిమా సమయంలోనే ఫ్యాన్స్ ఒక వెబ్ సైట్ తయారు చేయడానికి పూనుకుని  అఖిల్ ఫ్యాన్స్ డాట్ కామ్ అంటూ పేరు పెట్టబోతున్నారు అన్న విషయం తెలుసుకుని నాగార్జున వారిని పిలిపించి అఖిల్ ఫ్యాన్స్ అయినా చైతన్య అయినా నాగ్ ఫ్యాన్స్ లో పార్ట్ తప్ప ఇలా వేరువేరు వర్గాలను సృస్టించ వద్దు అని సున్నితంగా హెచ్చరించినట్లు టాక్. ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో వ్యాపారాలలోనే కాదు తన కొడుకులను శాస్వితంగా కలిసి ఉండేడట్లుగా నాగార్జున ఒక మంచి డాడీగా జాగ్రత్తలు  తీసుకుంటున్నాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: