‘బాహుబలి 2’  సీక్వెల్ కు తయారు అవుతున్న రాజమౌళిని మంచు విష్ణు ఇరుకున పెట్టాడు అన్న వార్తలు వస్తున్నాయి. రాజమౌళి ఊహలలో ఉన్న భారీ ప్రాజెక్ట్ కు మంచు వారి అబ్బాయి అనుకోని షాక్ ఇచ్చాడు. ‘బాహుబలి 2’ సినిమా పూర్తి అయిన తరువాత రాజమౌళి  వెయ్యి కోట్లతో ఒక  సినిమాని చేయబోతున్నాడని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది ప్రఖ్యాతిగాంచిన ఒక కన్నడ నవల ఆధారంగా ఆ చిత్రాన్నితీయ్యాలని రాజమౌళి డ్రీమ్ అనే వార్తలు కూడ ఉన్నాయి. 

అయితే ఈ మధ్య కేరళ రాష్ట్రంలోని తిరువనంత పురంలో తన స్నేహితుడు ఇంటిలో జరుగుతున్న పెళ్ళికి వచ్చిన రాజమౌళిని మీడియా వర్గాలు ఈ సినిమా విషయమై మాట్లాడినప్పుడు ఈసినిమా ఆలోచన గురించి స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా ఈప్రోజేక్ట్ గురించి తాను ప్రస్తుతం అలోచిoచడం లేదు అంటూ గుంభనంగా సమాధానం ఇచ్చాడు రాజమౌళి. అయితే ఇప్పుడు ఆ ‘గరుడ’ అన్న టైటిల్ ని మంచు విష్ణు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  

దీనితో జక్కన్న తీయాలనుకుంటున్న ఆసినిమా నిర్మాణంలో మంచు విష్ణు కూడా భాగం కాబోతున్నాడా ? అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి దృష్టి అంతా ప్రస్తుతం ‘బాహుబలి 2’ పై ఉండటంతో ఈ పవర్ ఫుల్ టైటిల్ పెట్టుకుని మంచువారి అబ్బాయి ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అంటూ అప్పుడే ఫిలింనగర్ లో చర్చలు మొదలు అయిపోయాయి. 

సంచలనాలు సృష్టించడంలో తన తండ్రి మోహన్ బాబు వారసత్వాన్ని కొనసాగిస్తున్న విష్ణు ఈ ‘గరుడ’ తో ఏదో మేజిక్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: