ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేరు ఒక్కటే..అదే కోనవెంకట్. స్టార్ రైటర్ గా పేరు సంపాదించుకున్న కోన వెంకట్...ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సక్సెస్ ఫుల్ ఫిల్మ్స్ కి రైటర్ గా పనిచేశాడు.  శ్రీనువైట్ల నుండి బయటకు వచ్చి తనే సొంతంగా డైరెక్షన్, నిర్మాణం వంటి విభాగాల్లోనూ దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే కోనవెంకట్ తాజాగా వరుస మూవీలకి పని చేస్తున్నాడు. ఒక మూవీ రిలీజ్ కాగానే, వెంటనే కోన వెంకట్ పనిచేసిన మరో మూవీ రిలీజ్ కి సిద్ధం అవుతుంది.


ఇలా ఒకవైపు రైటర్ గా పనిచేస్తూనే...మరో వైపు మూవీలకి దర్శకత్వ బాధ్యతలని చేపడుతున్నాడు. అదే సమయంలో నిర్మాణ సంబంధిత మూవీలను సైతం తెరకెక్కిస్తున్నాడు. అలా చేసిన ‘గీతాంజలి’ సినిమా గత ఏడాది పెద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు కోన వెంకట్ చేస్తున్న మరో ప్రయత్నమే శంకరాభరణం’. నిఖిల్, నందిత కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 4న రిలీజ్ అవుతుంది. ఈ మూవీపై కోన వెంకట్ భారీ ఆశలను పెట్టుకున్నాడు.


ఇక ఈ మూవీ అనంతరం కోన వెంకట్ హైదరబాద్ డ్రగ్ మాఫియా నేపధ్యంలో సినిమాకి కథని సిద్దం చేసుకుంటున్నాడు. ఓ సీనియర్ సిటీ పోలీస్ నుండి డ్రగ్ మాఫియా ఏ విధంగా డ్రగ్స్ ని చేతులు మారుస్తూ, కోట్ల రూపాయలను ఆర్జిస్తుంది వంటి విలువైప సమాచారాన్ని తెలుసుకున్నాడు. ఈ ప్రక్రియలో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారు? వంటి విషయాలను తెలుసుకొని షాక్ అయ్యాడంట.


అయితే ఇందులో టాలీవుడ్ కి చెందిన పలువురు బడా నిర్మాతలు, హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నారని తెలిసిందట. ఇక రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి కోన నిర్మించనున్న ఈ సినిమాకి తనే దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ స్టార్స్ డ్రగ్స్ ని వాడుతున్నారో తెలుసుకాబట్టి, ఆ వివరాలను కోన వెంకట్ తన మూవీలో చూపించనున్నాడా? అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో టాలీవుడ్ స్టార్స్ డ్రగ్ సీక్రెట్స్ ని విప్పబోతున్న కోనపై, ఇండస్ట్రీ ఆసక్తిని చూపుతుంది. ఈ మూవీకి పౌడర్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు వివరాలు తెలుస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: