సాయిధరమ్ తేజ్ రెజీనాల మధ్య ఎదో నడుస్తోంది అన్న వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నా ఈమధ్య కాలంలో వీరిద్దరి సాన్నిహిత్యం మరింత పెరిగి పోయింది అన్న గాసిప్పులు ఫిలింనగర్ లో తెగ హడావిడి చేస్తున్నాయి. ఈ స్థాయిలో ఒక మెగా కుటుంబ హీరో పై గాసిప్పులు రావడం గతంలో ఎప్పుడూ జరగలేదు అని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. 

సాయి ధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ తో మొదలైన వీరి స్నేహం అంచలంచలుగా పెరగడమే కాకుండా వెండితెర పై వీరి జంటకు మంచి మార్కులు పడటంతో వీరి స్నేహం మరింత పెరిగింది అని అంటారు. ఆ తరువాత వచ్చిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కూడ విజయవంతం కావడం వీరి స్నేహాన్ని మరింత బలపరిచింది అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాల తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమాలు లేకపోయినా వీరికి సంబంధించిన వార్తలు మాత్రం ఫిలింనగర్ కు హాట్ న్యూస్ గా మారుతున్నాయి. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం అమెరికాలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వీరిద్దరి సాన్నిహిత్యం చూసి ఆ సినిమా యూనిట్ సభ్యులే ఆశ్చర్య పోయారు అని అంటారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమాలు లేకపోయినా రెజీనా తరుచూ సాయిధరమ్ తేజ్ నటిస్తున్న షూటింగ్ సెట్స్ కు తరుచూ వెళుతూ తెగ సందడి చేస్తోందని టాక్. 

అయితే రెజీనా తన స్నేహాన్ని సాయి ధరమ్ తేజ్ తో కొనసాగిస్తూనే మిగతా హీరోల సినిమాలలో అవకాశాలు పొందేలా చాల ప్రయత్నాలు చేస్తోంది అనే వార్తలు ఉన్నాయి. దీనికితోడు సాయి ధరమ్ తేజ్ కూడ తనకు సాన్నిహిత్యం ఉన్న దర్శక నిర్మాతలతో వారి సినిమాలలో రెజీనాకు అవకాశాలు ఇవ్వమని రెజీనాను ప్రమోట్ చేస్తున్నట్లుగా కూడ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరి వ్యవహార శైలిని పరిశీలిస్తున్న ఫిలింనగర్ వర్గాలు వీరి ప్రేమ ఇంకా బలపడుతుందా ? లేదంటే చాలామంది ప్రేమలులా మధ్యలో బ్రేకప్ అయిపోతుందా ? అంటూ వారిద్దరి పై సెటైర్లు వేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: