పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ సర్ధార్ గబ్బర్ సింగ్. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ టాక్స్, పనవ్ కళ్యాణ్ ని టెన్షన్ లో పడేస్తుందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బాబీ,  ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ మూవీనే డైరెక్ట్ చేస్తున్నాడు.


ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ గుజరాత్ లోని వడోదరలో జరుగుతోంది. బాబీ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ పై పలు ఆసక్తికరమైన టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీకి సంబంధించిన ఓ విషయంపై దర్శకుడు, పవన్ కళ్యాణ్ తో చర్ఛిస్తున్నాడు. దర్శకుడు మాటలకి పవన్ కళ్యాణ్ సైతం టెన్షన్ లో పడ్డట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నటించే ప్రతి మూవీలో బిట్ సాంగ్స్ కి ప్రాధాన్యత ఉంటుంది. గతంలో అత్తారింటికి దారేది సినిమాలో పాడిన కాటమరాయుడా సాంగ్ చాలా పాపులర్ అయింది. ఇక తాజాగా సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీలోనూ ఈ తరహా పాట ఉండాలనే అభిప్రాయాన్ని, దర్శకుడు చెప్పుకొచ్చాడంట.


ఇందుకు పవన్ కళ్యాణ్ మొదట అంతగా ఆసక్తి చూపించలేదంట. దీంతో దర్శకుడు ఇంకో అడుగు ముందుకేసి, “ఈ మూవీలో కంపల్సరీగా మీరు బిట్ సాంగ్ పాడాల్సిందే...అలా జరిగితేనే మూవీపై పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. హైప్ క్రియేట్ అవుతుంది. ఇప్పటికే మూవీపై చాలా నెగిటివ్ టాక్స్ వినిపిస్తుంది. మీరు కంపల్సరీగా పాడాల్సిందే” అని చెప్పుకొచ్చాడంట. అంతే కాకుండా దేవీశ్రీ ప్రసాద్ కూడా బాబీకి సపోర్ట్ చేస్తున్నాడంట.


దీంతో పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీలో పాటను పాడాలా?లేదా? వంటి విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఎంతటి పెద్ద స్టార్ అయినప్పటికీ మూవీపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ప్రేక్షకుల్లోకి వెళ్లిందంటే...మూవీ రిలీజ్ తరువాత రిజల్ట్ తారుమారు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అత్తారింటికి దారేది, గోపాల గోపాల వంటి సక్సెస్ లతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్....అటు రాజకీయ పరంగానూ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.


ఇటువంటి పరిస్థితుల్లో మూవీ ప్లాప్ అయితే అందరూ పనవ్ కళ్యాణ్ ని టార్గెట్ చేయటం ఖాయం అని అంటున్నారు. మొత్తంగా దర్శకుడు చెప్పిన సలహా ప్రకారం పాట పాడితేనే బెటర్ అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడంట. ప్రస్తుతం పవన్ దీనికి సంబంధింన టెన్షన్ ఉన్నట్టు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: