తెలుగు ఇండస్ట్రీలో ‘ఇష్టం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ శ్రియ శరణ్. తర్వాత అగ్ర హీరోల సరసన నటిస్తూ మంచి పొజీషన్లోకి వచ్చింది. తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అక్కడ అంత పెద్ద సక్సెస్ సాధించలేక పోయింది. నిన్నటి వరకు సౌత్ తో పాటు బాలీవుడ్ లోను వరుస సినిమాలో బిజీగా ఉన్న శ్రియ శరణ్ ఇప్పుడు ఖాళీగానే ఉందట. అయితే ఈ సంవత్సరం వెంకటేశ్, పవన్ కాంబినేషన్ లో వచ్చిన గోపాల గోపాల చిత్రంలో నటిచింది.

బాలీవుడ్ లో  హిందీ దృశ్యం చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించినా ఈ అమ్మడికి మాత్రం కలిసి రాలేదు. దీంతో ఇప్పుడు  ఖాళీ టైమ్ ను తెగ ఎంజాయ్ చేయాలని చూస్తుందట. గోవా కు వెళ్లిన శ్రియ బీచ్ లో తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

శ్రియ శరణ్


శ్రియతో పాటు రానా దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేసింది శ్రియ..అంతేకాకుండా కోతి బోమ్మలతో దిగిన సరదా ఫోటోలను పోస్ట్ చేసి..కోతులతో వ్యాపారం చేస్తున్న అంటూ ట్విట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ నెట్ వర్క్ లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: