సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ అనుష్క. తెలుగులో దాదాపు అగ్ర హీరోల సరసన నటించి నెం.1 పొజీషన్లోకి వచ్చింది. స్వతహాగా యోగా టీచర్ అయిన అనుష్క తన బాడీని మంచి ఫిట్ నెస్ తో ఉంచుకుంటుంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ తెచ్చుకున్న అనుష్క ఆ మద్య అరుంధతి,పంచాక్షరి,రుద్రమదేవి,బాహుబలి చిత్రాలో అద్భుతమైన నటన కనబరిచి విమర్శకుల చే ప్రశంసలు అందుకుంది.  తాజాగా విడుదలైన సైజ్ జీరో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. నటన పరంగా అనుష్కకు వంద మార్కులు వచ్చినా..కథ పరంగా ఆకట్టుకోలేక పోయింది.


ఇక ‘సైజ్ జీరో’ కోసం 20 కిలోల బరువు పెరిగిందట. అనుష్కకు ప్రయోగాత్మక పాత్రల్లో నటించడం కొత్తేమీ కాదు. కాకపోతే సైజ్ జీరో మాత్రం తన కెరీర్ లో  రిజల్ట్ తేడా కొట్టడంతో కొంచెం నిరుత్సాహ పడింది. ఇక బాహుబలి 2 సినిమాలో మంచి గ్లామర్ పాత్రలో కనిపించ నుందట..ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.. మరోవైపు  కోలీవు డ్ లో సింగం 3  సినిమాకు సిద్ధమవుతోంది.  బాహుబలి 2 తర్వాత  ప్రభాస్ బ్యానర్ లో నటించేయడానికి అనుష్క ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.   ప్రభాస్ బ్యానర్  అంటే ఆయన సొంత బ్యానర్ కాదులేండి..రెబెల్ స్టార్ చెప్పిన యూవీ క్రియేషన్స్ పై అన్నమాట. ప్రమోద్ - వంశీలు నిర్మించే ఓ ప్రాజెక్ట్ కు ఈ హాట్ బ్యూటీ  ఓకే చెప్పిందని తెలుస్తోంది.


బాహుబలి 2 లో అనుష్క


ఈ సినిమా స్టోరీ లైన్ చాలా బాగుండటంతో..అనుష్క వెంటనే ఓకే చెప్పిందట. ఇకపోతే ఇందులో హీరో ఎవరు అనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు. ప్రభాస్ కూడా తన కజిన్స్ నిర్మించబోయే చిత్రంలో అనుష్కతో కలిసి చేస్తాడా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇదంతా మాటల వరకు నడిచన వ్యవహారమే.. దీని గురించి పూర్తి డిటేల్స్ కోసం ప్రభాస్ ని సంప్రదిస్తే బాహుబలి 2 షూటింగ్ లో బీజీ బీజీగా ఉన్నాడు. మరి ఈ విషయాల్నీ అనుష్కనే అనౌన్స్ చేస్తుందా మరి ఎప్పుడు చేస్తుందో వేయిట్ చాయాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: