గత మూడు వారాల నుంచీ పవన్ కళ్యాణ్ - ఎస్ జే సూర్యల మధ్యన ఒక సినిమా ఉంది అంటూ కొత్త  న్యూస్ హడావిడి చేస్తోంది. పవన్ కళ్యాణ్ కి ఖుషీ లాంటి ఇండస్ట్రీ  హిట్ ఇచ్చి తరవాత కొమరం పులి లాంటి డిజాస్టర్ ఇచ్చిన ఎస్ జే సూర్య కి పవన్ కళ్యాణ్ మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు అంటూ వార్త షికారు చేస్తోంది. ప్రస్తుతం మనకి అందుతున్న సమాచారం మేరకు చూస్తే ఈ వార్త నిజమే అని ఆన్సర్ వస్తోంది.

 

 

 

పవన్ కళ్యాణ్ ఇంతకీ చేయ్యబోయేది ఖుషి సీక్వెల్ కాదట, తమిళ సూపర్ స్టార్ అజిత్ నటించిన 'వీరం' సినిమా కి రీమేక్ ని తెలుగులో చెయ్యబోతున్నాడు అంటున్నారు. ఆ సినిమా అప్పట్లో హిట్ అయిన పెద్దరికం అనే సినిమాకి పోలిక గా ఉంటుంది. నలుగురు తమ్ముళ్ళకి అన్నగా నటించిన అజిత్ ఈ సినిమా హిట్ అవ్వడంలో కీలక భూమిక పోషించాడు. అతని నటన చాతుర్యం, యాక్షన్ , డ్రామా అన్నీ కలిసి ఆ సినిమాని హిట్ చేసి పారేసాయి.

 

 

 

ఇదే సినిమాని ఎన్టీఆర్ కి చూపించినా అతను రెజెక్ట్ చేసాడు అని టాక్ వచ్చింది అప్పట్లో. పవన్ కి బాగుంటుంది అని ఎస్ జే సూర్య రికమెండ్ చేసాడు అనీ కళ్యాణ్ త్వరలో ఈ సినిమా చూసి ఏ విషయం చెప్తాడు అనీ అంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: