మెగా నందమూరి కుటుంబ హీరోలు బయట ఫంక్షన్స్ లో కనిపించినప్పుడు ఒకరి పై ఒకరు ప్రేమను వ్యక్త పరుస్తూ మీడియా కెమెరాలకు పోజులు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా బాలకృష్ణ చిరంజీవిల మధ్య కోల్డ్ వార్ నడిచినా ఆ వార్ ను బయట పడకుండా గతంలో వారిద్దరు చాల జాగ్రత్తగా మేనేజ్ చేసారు. 

అటువంటి నందమూరి మెగా కుటుంబ హీరోలతో ఒక మల్టీ స్టారర్ వస్తుంది అంటే ఎవరూ నమ్మరు. అయితే ప్రస్తుతం ఆ అసాధ్యం, సాధ్యం కాబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. దర్శకుడు ఎఎస్ రవికుమార్ చౌదరి ఈ సాహసం చేయబోతున్నట్లు టాక్. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ దర్శకుడు ఈమధ్యనే తాను దర్శకత్వం వహించిన ‘సౌఖ్యం’ సినిమా ఫ్లాప్ నుండి తేరుకుని ఇద్దరి హీరోలకు సరిపడే ఒక వెరైటీ కథను తయారు చేసినట్లు తెలుస్తోంది. 

ఈ కథను ముందుగా రవికుమార్ చౌదరి సాయి ధరమ్ తేజ్ కు వినిపించి అతడి అంగీకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన మొట్టమొదటి సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ తీసి తనకు హిట్ అందించిన సెంటిమెంట్ తో సాయి ధరమ్ తేజ్ రవికుమార్ చౌదరి కథకు వెంటనే ఓకె చెప్పినట్లు టాక్. మెగా యంగ్ హీరో ఇచ్చిన ఉత్సాహంతో ఈ సినిమాకు సంబంధించి రెండవ హీరో అన్వేషణ మొదలుపెట్టిన రవికుమార్ చౌదరి ఈకథను కళ్యాణ్ రామ్ కు కూడ వినిపించడంతో అతడికి రవికుమార్ చౌదరికి ఉన్న సాన్నిహిత్యంతో అతడు కూడ ఈ మల్టీ స్టారర్ కు ఓకె అన్నట్లు తెలుస్తోంది. 

అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఈ ప్రాజెక్ట్ నిజంగా పట్టాలు ఎక్కితే చిరంజీవి బాలకృష్ణలు చేయలేని సాహసం కళ్యాణ్ రామ్ సాయి ధరమ్ తేజ్ లు చేస్తూ ఈ రెండు కుటుంబాల మధ్య సంచలనం సృస్టించ బోతున్నారు అనుకోవాలి. సాయి ధరమ్ తేజ్ కు క్రేజ్ రీత్యా ఈసినిమాను మార్కెట్ చేయడం కూడ చాల తేలికగా మారుతుంది. ఏమైనా నందమూరి మెగా కుటుంబాల మల్టీ స్టారర్ కు కౌంట్ డౌన్ మొదలైంది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: