మోడల్ గా జీవితాన్ని మొదలు పెట్టి ఆ తరువాత హీరోయిన్ గా మారి అటు పై మహేష్ భార్యగా సెటిల్ అయిన నమ్రతా శిరోద్కర్ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పిల్లలు గౌతమ్ సితారల అల్లరి పై సెటైర్లు వేసింది. తన పిల్లలలో ఎవరు ఎక్కువ నాటీ ? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ నమ్రత కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తనకొడుకు గౌతమ్ సెల్ఫ్ డిసిప్లీండ్ ఉంటూ అందరితోను కలుస్తూ ఉంటాడని అదేవిధంగా తన కొడుకు గౌతమ్ కు స్నేహితులు కూడ చాల ఎక్కువ అని కామెంట్ చేసింది నమ్రత. అయితే తన కూతురు సితార మాత్రం చాల రివర్స్ అని చెపుతూ ఆమె అల్లరి తాము తట్టుకోలేక పోతున్నాము అని అంటూ తన కూతురుని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేసింది నమ్రత. 

తనకు వంటరాని విషయాన్ని బయట పెడుతూ మహేష్ హైదరాబాద్ బిర్యాని ఇష్టపడితే గౌతమ్ పిజ్జా ఎక్కువ ఇష్టపడతాడని చెపుతూ తన కూతురుకు కిచిడి బాగా ఇష్టపడి తింటుంది అని తన పిల్లల ఆహారపు అలవాట్లను బయటపెట్టింది నమ్రత. అయితే తనకు మాత్రం ఆంధ్రాభోజనం బాగా ఇష్టం అని చెపుతోంది ఈ ఘట్టమనేని వారి కోడలు. 

రాజకీయాలు అంటే అభిరుచి లేని తనకు నిజంగా ఒక్కరోజు అధికారాన్ని ఎవరైనా అప్పగిస్తే హైదరాబాద్ సిటీని క్లీన్ సిటీగా మార్చడానికి డ్రైవ్ మొదలుపెట్టి సిటీలోని ప్రతి ప్రాంతం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపడతాను అని చెపుతున్న నమ్రత మాటలు బట్టి ఈమెకు కూడ చాల సామాజిక స్ప్రహ ఉంది అని అనిపిస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: