పూరీ జగన్నాధ్ ఓ మూవీని తెరకెక్కించాలంటే హీరోల కంటే ముందు టైమింగ్ ముఖ్యం అని అంటాడు. తను ఓ మూవీని చేయటానికి రెడీగా ఉన్నప్పుడు, ఆ సమయంలో ఏ హీరో అందుబాటులో ఉంటాడో..ఆ హీరోతో కేవలం 2 నెలల్లోనూ సినిమాని పూర్తి చేస్తాడు. ఆ విధంగా పూరీ జగన్నాద్ తనదైన శైలితో ముందుకుపోతుంటాడు. ఈ మధ్య కాలంలో పూరీ జగన్నాధ్ బాగా హోప్ప్ పెట్టుకున్న చిత్రం చిరంజీవి 150వ చిత్రం.

ఈ మూవీని కచ్ఛితంగా హిట్ చేసేందుకు పూరీ ఎంతగానో శ్రమించాడు. చివరికి పూరీ తీసుకున్న సీరియస్ నెస్….చిరంజీవిలో కనిపించకపోయే సరికి..ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. దీంతో పూరీ బాగా నిరుత్సాహ పడ్డాడని తెలిసింది. దీంతో పూరీ మెగావర్గానికి దూరం అవుదామనే ఆలోచనలో ఉన్నాడట. ఇక నందమూరి వర్గానికి దగ్గరై, ఆ హీరోలకి సక్సెస్ లను ఇవ్వాలని  చూస్తున్నాడు. అందులోని భాగంగానే‘పటాస్’ తో హిట్ తో ఫాం లోకి వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేయటానికి పూరీ రెడీ అయ్యాడు.

రీసెంట్ గా వీరిద్దరి మధ్య కథా చర్ఛలు జరిగాయని అంటున్నారు. తరువాత ఈ సినిమాని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ అయిన ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ లో నిర్మించేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ ఇషాన్ తో చేస్తున్న మూవీ తరువాత కళ్యాణ్ రామ్ మూవీని సెట్స్ పైకి తీసుకువెళతాడంట. ఈ మూవీ తరువాత జూనియర్ తో ఓ మూవీని ప్లాన్ చేస్తున్నాడు పూరీ జగన్నాధ్.

ఇప్పట్లో మెగాహీరోలతో పూరీ సినిమాలు చేసే ఆలోచన లేదన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా పూరీ జగన్నాధ్కి, చిరంజీవి 150వ సినిమా చేజారే సరికి…మెగా వర్గంపై రివేంజ్ కి రెడీ అయ్యాడని అంటున్నారు. ఎందుకంటే తాజాగా సాయిధరమ్ తేజ్ , పూరి జగన్నాధ్ ని సంప్రదించగా తను మరో 3 సంవత్సరాలు బిజిగా ఉన్నానని చెప్పుకురావటం ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: