బాలీవుడ్ ఇండస్ట్రీలో కపూర్ వంశానికి పెద్ద పేరే ఉంది. ఫృద్విరాజ్ కపూర్ వారసులుగా ఎంతో మంది వచ్చారు. ముఖ్యంగా రాజ్ కపూర్ చాలా గొప్పపేరు వచ్చింది. కేవలం నటకే పరిమితం కాకుండా దర్శకత్వం, నిర్మాణ సారధ్యం కూడా ఆయన వహించారు. బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ చిత్రాలు నిర్మించారు. ఆయన తర్వాత ఆ స్థాయిలో ఒక్క రిషీకపూర్ కే పేరు వచ్చింది. బాబీ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రిషీకపూర్ ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు.
ఈయన వారసుడిగా రణదీర్ కపూర్ హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఇప్పటి వరకు సరైన హిట్ లభించలేదు. తాజాగా సినిమా 'కపూర్ అండ్ సన్స్'లో సరికొత్త లుక్తో అభిమానులను అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కురువృద్దుడిగా రిషీకపూర్ కనిపించబోతున్నారు..అయితే దీనికోసం ఆయన మేకప్ కోసం అక్షరాల రూ. 2 కోట్లు ఖర్చు చేశారట. ఈ విషయాన్ని ఓ టీవీ చానెల్తో మాట్లాడుతూ రిషీ కపూరే వెల్లడించాడు. 'టైటానిక్', 'ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్' వంటి సినిమాలకు పనిచేసిన అమెరికన్ మేకప్ ఆర్టిస్ట్ గ్రెగ్ కానమ్ సినిమాలో తనకీ ఈ కొత్త రూపును ఇచ్చినట్టు తెలిపాడు.
కపూర్ ఫ్యామిలీ ఫోటో
వాస్తవానికి ఇది భారీ బడ్జెట్ సినిమా కాకపోయినా మేకప్ విషయంలో నిర్మాత ఖర్చుకు ఏమాత్రం వెనకాడలేదని రిషీకపూర్ అన్నారు. ఈ మద్య కాలంలో భారతీయ చిత్రాలు కూడా హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్న విషయం దీన్ని బట్టే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించని తనకు ఇంత మంచి ఆఫర్ రావడం తన అదృష్టమని రిషీ చెప్పాడు. 'కపూర్ అండ్ సన్స్' నిర్మాత కరణ్ జోహర్దే ఈ క్రెడిట్ అంతా అని ఆయన ప్రశంసల్లో ముంచెత్తాడు.