జూనియర్ ఎన్టీఆర్ వల్ల నిర్మాత అశ్వనీ దత్ కు ఏర్పడిన నష్టాన్ని రామ్ చరణ్ పూడ్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో అశ్వనీ దత్ ఎన్టీఆర్ తో మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘శక్తి’ అనే సినిమా తీసాడు. అయితే ఆ సినిమా ఘోరమైన ఫ్లాప్ అవ్వడంతో అశ్వనీ దత్ కు విపరీతమైన నష్టాలు వచ్చాయి. 

ఆ నష్టాలను పూడ్చడానికి జూనియర్ అశ్వనీ దత్ కు ఒక సినిమా చేస్తానని గతంలో మాట ఇచ్చినా ఆ మాటను నిలుపుకోలేక పోయాడు. అయితే ఇప్పుడు ఆ బాధ్యతను రామ్ చరణ్ తలకేత్తుకో బోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చరణ్ ‘తని ఒరువన్’ తరువాత అశ్వనీ దత్ కు ఒక సినిమా చేయడానికి మాట ఇచ్చాడు అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. 

చరణ్ మొట్టమొదటి చిత్రం ‘చిరుత’ సినిమాను అశ్వనీ దత్ నిర్మించి చరణ్ టాలీవుడ్ ఎంట్రీకి సూత్రధారి అయిన విషయం తెలిసిందే. చిరంజీవితో అశ్వనీ దత్ కు ఉన్న సాన్నిహిత్యం రీత్యా ప్రస్తుతం అశ్వనీ దత్ సమస్యలకు పరిష్కారంగా చరణ్ ఈ కొత్త మూవీ ప్రాజెక్ట్ ను ఒప్పుకుని సహాయ పడుతున్నాడు అని టాక్. ఈ మూవీకి దర్శకుడు మారుతీ దర్శకత్వం వహిస్తాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

ఎప్పటి నుంచో మెగా కుటుంబ టాప్ హీరోతో సినిమాను చేయాలని కలలు కంటున్నా మారుతీకి ఈవిధంగా తన కల తీరబోతోంది అనుకోవాలి. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయని టాక్. మారుతి లేటెస్ట్ గా వెంకటేష్ తో తీస్తున్న ‘బాబు బంగారం’ మూవీ పూర్తి అయిన తరువాత ఈ ప్రాజెక్ట్ విషయమై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: