టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న నటుల్లో శర్వానంద్ ఒకరు. ప్రస్థానం మూవీ తరువాత పలు మూవీల్లో శర్వానంద్ నటించాడు కానీ, తనకు సరైన బ్రేక్ మాత్రం ఏ మూవీ ఇవ్వలేదు. అయితే ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ వంటి మూవీలు శర్వానంద్ కి కొంత మేర పేరుని తీసుకువచ్చాయి. ఇక తాజాగా సంక్రాంతి బరిలో పోటీ పడి ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాతో మంచి సక్సెస్ ని సాధించాడు. ఈ సక్సెస్ ని ప్రస్తుతం శర్వానంద్ ఎంజాయ్ చేస్తున్నాడు.


దీంతో చాలా మంది నిర్మాతలు, దర్శకులు శర్వానంద్ కోసం క్యూ కడుతున్నారు. కానీ వరుస మూవీలకి శర్వానంద్ ఒప్పుకోవటం లేదు. కథ బాగా నచ్ఛితేనే చేసేందుకు రెడీ అంటున్నారు. అలాగే తన రెమ్యునరేషన్ ని సైతం భారీగా పెంచేశాడు. గతంలో కేవలం కోటి యాభైలక్షలు, లేదా రెండు కోట్ల రూపాయలతో సర్ధుకుపోయే శర్వానంద్…ఈ సారి మాత్రం ఏకంగా 5 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నాడంట.


శర్వానంద్ తన తదుపరి సినిమాని సందీప్ కిషన్ తో ‘రారా కృష్ణయ్య’ సినిమా చేసిన పి. మహేష్ డైరెక్షన్ లో చేయనున్నాడు. మహేష్ ఈ సారి శర్వానంద్ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కథని సిద్దం చేశాడు. ఈ మూవీని భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఈ మూవీకే శర్వానంద్ బారీ రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారు.


ఇప్పటి వరకూ తక్కువ రెమ్యునరేషన్ తో చేసుకుంటూ వచ్చిన శర్వానంద్; ఇక నుండి మాత్రం తక్కువ సినిమాలను చేస్తూ…తన మార్కెట్ ని పెంచుకునేందుకు ప్రయత్నాలను చేస్తున్నాడు. అంతే కాకుండా తన సినిమాకి సంబంధించిన హీరోయిన్స్ విషయంలో టాప్ హీరోయిన్స్ ఉండేగా ప్లాన్ చేసుకుంటున్నాడంట. వరుస సినిమాలను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించ వద్దు అంటూ శర్వానంద్ కి, మెగాహీరో రామ్ చరణ్ సలహా ఇచ్చాడంట.



మరింత సమాచారం తెలుసుకోండి: