పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి, సంచలన మార్పు తీసుకువస్తాడని అందరూ భావించారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ పార్టీని పెట్టిన తరువాత ప్రశించటానికే పరిమితం అయ్యాడు…అంతుకు మించి ఒక్క అడుగుకూడ ముందుకు వేయలేకపోతున్నాడు. ఇందుకు తనలో ఎన్నో భయాలు, ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే మరో వైపు తను సినిమాలను సైతం సరైన ప్లానింగ్ లో పూర్తి చేయలేకపోతున్నాడు.


ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణే గుర్తించాడు. అందుకే పవన్ తీసుకున్న సంచలన నిర్ణయం అందిరికి షాక్ ని ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి అడుగుపెట్టి జనసేన పార్టీని స్థాపించాడు. అలాగే మరోవైపు సినిమాలు చేస్తున్నాడు. కానీ అటు సినిమాలను, ఇటు రాజకీయాలను పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నాడు. ఈ వెలితిని గుర్తించిన పవన్ కళ్యాన్ కొద్ది కాలం పాటు రాజకీయాలకు దూరం ఉండాలని చూస్తున్నాడు.


ఇప్పటి వరకూ కమిట్మెంట్ ఇచ్చిన చిత్రాలను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడంట. సర్దార్ గబ్బర్ సింగ్ ని త్వరగా పూర్తి చేసి, తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నాడు. ఎస్.జె సూర్యతో ఖుషీ సీక్వెల్ ని, అలాగే వేదాలం రిమేక్ ని పవన్ ఓ సంవత్సరంలో పూర్తి చేసేందుకు ప్లానింగ్ చేసుకుంటున్నాడు. అయితే రాజకీయాలకు దూరంగా పవన్ ఉండబోతున్నాడు అనే నిర్ణయం పట్ల అభిమానులే కాకుడా సాధారణ ప్రజానికం సైతం అంత ఆసక్తి చూపించటం లేదు.


పవన్ కళ్యాణ్ ఏదొకటి చేస్తాడు అనే ఆశ కొంత మందిలో ఇప్పటికే ఉంది. కానీ పవన్ తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా, పవన్ పై పెట్టుకున్న ఆ కొద్దిపాటి హోప్స్ కూడ ఇప్పుడు పోయాయని అంటున్నారు. ఇక మరికొంత మంది అయితే తను రాజకీయ పార్టీ పెట్టాడనే కానీ, ఇప్పటి వరకూ చేసేందేమి లేదు. తను సినిమాలను చూసుకోవటమే కరెక్ట్ అని అంటున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం పై అన్నీ చోట్ల నుండి ప్రతిస్పంధనలు వస్తున్నట్టుగా తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: