కోలీవుడ్ బ్యూటీ నయనతారను మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో ఎయిర్ పోర్టులో ఆ ఎయిర్ పోర్ట్ అధికారులు గురువారం రాత్రి అదుపులోకి తీసకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె పేరుకు, పాస్ పోర్టులో ఉన్న పేరులో కొన్ని తేడాలు ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్టు సిబ్బంది ప్రశ్నిస్తున్నట్లు కొన్ని తమిళ ఛానల్స్ ఫ్లాష్ న్యూస్ లు ప్రసారం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా ఈ వార్తలు టాలీవుడ్ లోని చాలామందికి షాక్ ఇచిన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో నయనతార హైదరాబాద్ లోని తన సన్నిహితులకు ఫోన్ చేసి సమస్యను వివరించి వారి సహాయాన్ని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. 

నయనతార ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఇరు ముగన్' అనే తమిళ సినిమా షూటింగులో పాల్గొనడానికి ఆమె మలేషియా వెళ్ళినట్లు తెలుస్తోంది ఈసినిమాలో కోలీవుడ్ హీరో విక్రమ్  హీరోగా నటిస్తున్నాడు. అయితే నయనతార కౌలాలంపూర్ ఎయిర్ పోర్ట్ లో ఆ ఎయిర్ పోర్టు అధికార్లు రొటీన్ గా అడిగే ప్రశ్నలకు నయనతార సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో ఈ సమస్య వచ్చి ఉండవచ్చు అన్న అనుమానాన్ని కూడ వ్యక్తపరుస్తున్నారు. 

నయనతార తాను దక్షిణాది ప్రాంతానికి చెందిన ప్రముఖ సినిమా నటిని అని ఆధికారులతో ఆమె చెపుతున్నా కౌలాలంపూర్ లో ఆమె హవా పనిచేయడం లేదు అని టాక్. ఇటువంటి విషయాలను చాల స్పీడ్ గా వెలుగులోకి తీసుకు వచ్చే కోలీవుడ్ మీడియాకు ఈ న్యూస్ హాట్ న్యూస్ గా మారింది అని టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: