మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు ఎవరూ అంటే మహేష్‌ బాబు, పవన్ కళ్యాణ్ పేర్లు వినిపిస్తాయి. ఈ విషయాన్ని స్వయంగా అనేక సార్లు త్రివిక్రమ్‌ తన ఇంటర్వ్యూలలో చెప్పాడు. అటువంటిది త్రివిక్రమ్ తీసుకున్న ఒక లేటెస్ట్ నిర్ణయం మహేష్ కు ఆశ్చర్యాన్ని కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా వీరిద్దరి సినిమాలు సమ్మర్ రేసులో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉండటం షాకింగ్ గా మారింది. 

మహేష్‌ సినిమా ‘బ్రహ్మోత్సవం’ రిలీజ్‌ డేట్‌ ఇప్పటికే అధికారికంగా ఫిక్స్ అయింది అన్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడిక త్రివిక్రమ్‌ సినిమా ‘అ ఆ’ కూడా రిలీజ్‌ డేట్‌ ను అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం ‘బ్రహ్మోత్సవం’ వచ్చే వారం ముందు అంటే ఏప్రిల్‌ 22న విడుదల కాబోతున్నట్లు నిన్న ప్రకటన వచ్చింది. 

అయితే మహేష్ సినిమా విడుదల అయ్యే ఒక వారం రోజులు ముందు కాని ఆ తరువాత వారంలో కాని మరో సినిమా విడుదల చేయడానికి ఎవరూ సాహసించరు. దీనికి కారణం ధియేటర్ల సమస్య మాత్రమే కాకుండా మహేష్ హవా ముందు తమ సినిమా ఎంత బాగున్నా మహేష్ సునామీలో కొట్టుకు పోతుంది అని భయపడతారు. అటువంటిది త్రివిక్రమ్ ఏ ధైర్యం చూసుకుని మహేష్ ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు ఎదురు నిలుస్తున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అయితే లేటెస్ట్ గా ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ ఆలస్యం జరుగుతూ ఉండటంతో అనుకున్న తేదీకి విడుదల కాదు అన్న గాసిప్పులు వస్తున్నాయి. ఈ వార్తలు త్రివిక్రమ్ కు ముందే తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: