నిహారిక టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం మెగా కుటుంబంలోని చాలామందికి ఇష్టం లేదు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే నిహారిక నటిస్తున్న తొలి తెలుగు వెబ్ సీరీస్ ‘ముద్దపప్పు ఆవకాయ్’ కి వస్తున్న స్పందన చూసి మెగా కుటుంబం షాక్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ ఎపిసోడ్ ను 7 లక్షల 50 వేల మంది చూస్తే రెండవ ఎపిసోడ్ ను 6 లక్షల 30 వేలమంది చూడటం యూట్యూబ్ వర్గాలను కూడ ఆశ్చర్య పరిచినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఈ వెబ్ సిరీస్ ను ప్రణిత్ బ్రహ్మాండ పల్లి అనే ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తే ప్రతాప్ అనే యంగ్ హీరో ఈ వెబ్ సిరీస్ లో ముద్దపప్పు పెళ్ళి కొడుకుగా నటిస్తున్నాడు. అయితే ఈ వెబ్ సిరీస్ ను మొదట్లో 12 భాగాలుగా చిత్రీకరిద్దామని భావించినా నిహారిక ప్రస్తుతం నటిస్తున్న తొలి సినిమా షెడ్యూల్స్ డేట్స్ క్లాష్ రావడం వల్ల కేవలం 5 ఎపిసోడ్స్ కు ఈ ముద్దపప్పు ఆవకాయ్ సిరీస్ ను పరిమితం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున కాజల్ నాగచైతన్య లక్ష్మి మంచు నాని లాంటి ఎందరో హీరోలు హీరోయిన్స్ యూట్యూబ్ లో ఈ ముద్దపప్పు ఆవకాయ్ ఎపిసోడ్స్ ను చూసి నిహారికను అభినందించడమే కాకుండా తమ అభిప్రాయాలను చిరంజీవి నాగబాబుల దృష్టికి  తీసుకువెళ్ళడంతో రోజురోజుకు పెరిగిపోతున్న నిహారిక క్రేజ్ ను చూసి మెగా ఫ్యామిలీ షాక్ అవుతున్నట్లు టాక్.

ఇప్పటికే మధురా శ్రీధర్ నిర్మాణ సంస్థలో నిహారిక తన మొట్టమొదటి సినిమా చేస్తున్న నేపధ్యంలో ఈ ముద్దపప్పు ఆవకాయ్ ఇచ్చిన క్రేజ్ తో నిహారిక మొట్టమొదటి సినిమాకు విడుదల కాకుండానే మార్కెట్ రీత్యా కూడ భారీ క్రేజ్ ఏర్పడేలా చేసింది. అందుకే కాబోలు నిహారికకు మొట్టమొదటి సినిమాకే 40 లక్షలు పారితోషికం ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: