మంచు లక్ష్మీ ఏమిచేసినా ఒక సంచలనమే సినిమాలు తీయడంలోనే కాదు తాను ప్రజంట్ చేసే టివి షోలలో కూడ తన బ్రాండ్ ఇమేజ్ ను చాటుకుంటుంది. గతంలో అనేక టివి షోలను ప్రజెంట్ చేసి తన ప్రత్యేకతను చాటుకుంది ఈ మంచువారి అమ్మాయి. 

‘ప్రేమతో మీ లక్ష్మి’ షోతో స్టార్ట్ చేసి ‘లక్కుంటే లక్ష్మి’ ‘దూసుకెళ్తా’ ‘బూమ్ బూమ్’ వంటి బుల్లితెర షోలతో సెలెబ్రెటీగా మారిపోయింది మంచులక్ష్మి. ఈ నేపధ్యంలో ఒక ప్రముఖ ఛానల్ ఈమెతో మళ్ళీ ఒక షోకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ కార్యక్రమం పేరు ‘మేము సైతం’ అంటూ జెమిని ఛానల్ నిర్వహించనున్న ఈప్రోగ్రామ్ త్వరలో ప్రసారం కాబోతోంది. 
ఈ కార్యక్రమం అంతా సోషల్ హెల్ప్ అనే కాన్సెప్ట్ పై ఉంటుంది అని తెలుస్తోంది. 

అయితే ఈషోకు సంబంధించిన మొట్టమొదటి షూటింగ్ ఈరోజు ప్రారంభం అయింది అని సమాచారం.  క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఈకార్యక్రమానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ ను ఈరోజు తన ట్విటర్ లో బయట పెట్టింది. ఈరోజు ఉదయం 10 గంటలకు హైద్రాబాద్ లోని  కేపీహెచ్బీలో కూరలు అమ్ముకుంటూ కనిపిస్తానని తన ట్విటర్ లో ట్విట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. 

అంతేకాదు మంచు లక్ష్మి నిర్వహించనున్న ‘మేము సైతం’ కార్యక్రమం కోసం మంజీరా మాల్ దగ్గర ఉన్న కేపీహెచ్ బీలో  మార్కెట్లో నేను కూరగాయలు అమ్మబోతున్నాను. సమాజాన్ని మార్చే ఓ ప్రోగ్రాం ఇది. రండి ఉదయం 10గంటల నుంచి వచ్చి నా దగ్గర నుంచి కూరలు కొనుక్కోండి' అంటూ ట్వీట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే రకుల్ పెట్టిన ఈ ట్విట్ చూసి ఆమె అభిమానులు ఎంతమంది తమ పనులు మానుకుని కూకట్ పల్లి పరిగెత్తారు అన్న విషయమై ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేకపోయినా ఆమె చేస్తున్న సమాజ సేవ ఈరోజు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: