టాలీవుడ్ సినిమా రంగంలో మరో అరుదైన సంఘటనకు రంగం సిద్ధం కాబోతోంది. ఇప్పటి వరకు టాప్ హీరోలు తమ కొడుకులు హీరోలుగా నటిస్తున్న సినిమా ఫంక్షన్స్ కు అతిధులుగా రావడం తెలుసు. అయితే ఇప్పుడు ఈ సీన్ రివర్స్ కాబోతోంది. సూపర్ స్టార్ కృష్ణ చాల గ్యాప్ తరువాత నటిస్తున్న ‘శ్రీశ్రీ’ సినిమా ఆడియో ఫంక్షన్ కు ప్రిన్స్ మహేష్ బాబు అతిధిగా రాబోతున్నాడు. 

ఈమధ్య కాలంలో సినిమాలకు పూర్తిగా దూరం అయిన కృష్ణ 70 సంవత్సరాలు దాటిపోయినా మళ్ళీ ఒక డిఫరెంట్ గెటప్ తో ‘శ్రీశ్రీ’ అనే టైటిల్ తో వస్తున్న సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కృష్ణ భార్య విజయనిర్మలతో పాటు ఆమె కుమారుడు సీనియర్ నరేష్ కూడ ఈసినిమాలో నటిస్తున్నారు. మహాకవి శ్రీశ్రీ పేరుతో వస్తున్న సినిమా కాబట్టి ఈ టైటిల్ బట్టి ఈ సినిమాకు ఫిలింనగర్ లో పాజిటివ్ టాక్ ఏర్పడింది. 

1990 ప్రాంతంలో అనేక సినిమాలు తీసిన ముప్పలనేని శివ ఈసినిమాను చాల విభిన్నమైన కథతో డైరెక్ట్ చేసాడు అని టాక్. అయితే ఈసినిమాలో మహేష్ చేత ఒక ప్రత్యేక పాత్రను చేయిద్దామని దర్శకుడు ప్రయత్నించినా మహేష్ ఈసినిమాకు తన వాయస్ ఓవర్ తో సరిపెట్టాడు. 

అంతటితో ఆగకుండా ఈసినిమాకు మరింత క్రేజ్ ను తీసుకు రావడానికి ఈనెల 18న జరగబోతున్న ఈసినిమా ఆడియో ఫంక్షన్ కు అతిధిగా రాబోతున్నాడు అని టాక్. ఘట్టమనేని కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనబోతున్న ఈ ఆడియో ఫంక్షన్ మరో హాట్ టాపిక్ కాబోతోంది. మహేష్ అభిమానులు అంతా కనీసం ఒక్కసారి ఈసినిమాను చూసినా ఈసినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: