బాహుబలి మూవీతో ప్రభాస్,రానాలకి భారీ డిమాండ్ పెరిగింది. దీంతో ప్రభాస్, రానా లు మాత్రం వారి మార్కెట్ ని విపరీతంగా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో మూవీ తీయాలంటే కనీసం 30 నుండి 40 కోట్ల రూపాయలను చేతిలో పట్టుకోవాల్సిందే. ఇది కేవలం తన రెమ్యునరేషన్ కింద మాత్రమే అని అంటున్నారు.


బాహుబలి మొదటి పార్ట్ 600 కోట్ల రూపాయలు సాధిస్తే, బాహుబలి2 వ భాగం 1000 కోట్ల దిశగా మార్కెటింగ్ వ్యవస్థ పనిచేస్తుంది.  ఇప్పుడు ప్రభాస్ మార్కెట్ ఇండియన్ బాక్సాపీస్ మార్కెట్ గా మారింది. అందుకే ఇక నుండి ప్రభాస్ తో ఇండియా వైడ్ సినిమాలను తీయాలని కొందరు నిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‘బాహుబలి 2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.


ఒకటి యువి క్రియేషన్స్ బ్యానర్ లో సుజీత్ డైరెక్షన్ చేయనున్నాడు. రెండవది కృష్ణంరాజు నిర్మాతగా రానున్న సినిమా. ఇవి కాకుండా తాజాగా మైత్రి మూవీ మేకర్స్ తో ప్రభాస్ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాహుబలి2 తరువాత ప్రభాస్ మైత్రి మూవీ మేకర్స్ తోనే నటించే అవకాశం ఉంటుందని అంటున్నారు.


ఎందుకంటే ఈ సంస్థ ఇప్పటికే ప్రభాస్ కి 10 కోట్ల రూపాయల అడ్వాన్స్ ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, ప్రభాస్ తో బాలీవుడ్ కాస్టింగ్ ని పెట్టి భారీ బడ్జెట్ ని ప్లాన్ చేసిందట. ఇది ఇండియా మొత్తంగా రిలీజ్ అవుతుంది. అంతే కాకుండా ప్రభాస్ కి దాదాపు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేటట్టుగా డీల్ కుదిరిందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: