టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కెరియర్ కు అఖిల్ సెంటిమెంట్ శాపంగా మారనున్నదా ? అని మహేష్ అభిమానులు కలవర పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన ఈ న్యూస్ ఇలా ప్రచారంలోకి రావడానికి ఒక కారణం ఉంది. మహేష్ తన సినిమా కెరియర్ ప్రారంభించి 16 ఏళ్ళు పూర్తి అయినా ఒకే సంవత్సరంలో రెండు సినిమాలు చేసిన సందర్భం ఒకే ఒక్కసారి జరిగింది. 2014 లో మహేష్ నటించిన ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ సినిమాలు ఒకే సంవత్సరంలో విడుదల అయ్యాయి. 

అయితే ఆరెండు సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లు గా మారాయి. దీని తరువాత మహేష్ చాల జాగ్రత్తగా అడుగులు వేస్తూ ‘శ్రీమంతుడు’ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటిస్తున్న మహేష్ ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే టాప్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో 90 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే. ఈసినిమాను తెలుగు తమిళ భాషలలో ఒకేసారి నిర్మిస్తున్నారు.

ఈసినిమా షూటింగ్ ఏప్రియల్ లో మొదలు పెడుతున్నారు. ఈసినిమాను ఎక్కడా గ్యాప్ లేకుండా నిర్మించి తమిళ ప్రజలకు అత్యంత పెద్ద పండుగ అయిన దీపావళి రోజున విడుదల చేయాలని మురగదాస్ గట్టి పట్టుదల పై ఉన్నట్లు టాక్. ఈ విషయానికి మహేష్ కూడ అంగీకరించినట్లు టాక్. ఈవిషయమే ఇప్పుడు ప్రస్తుతం మహేష్ అభిమానులను భయపెడుతోంది అని అంటున్నారు. 

ఈ సంవత్సరంలో మహేష్ నటించిన రెండు భారీ సినిమాలు విడుదల అవ్వడం ఆనందమే అయినా తెలుగు సినిమాలకు అచ్చిరాని దీపావళి రోజున మురగదాస్ మహేష్ ల సినిమా విడుదల అయితే మొదటికే మోసం వస్తుందేమో అని అప్పుడే ఖంగారు పడిపోతున్నారని తెలుస్తోంది. గత సంవత్సరం దీపావళికి వచ్చిన ‘అఖిల్’ సినిమా జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి మహేష్ అభిమానులు ఇలా ఖంగారు పడుతున్నారని అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: