ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ చర్ఛించుకునే టాపిక్ ఏదైనా ఉందంటే…అది నందిని రెడ్డి తెరకెక్కించిన కళ్యాణ్ వైభోగమే. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ రిలీజ్ కి నోచుకోలేదు. ఇందుకు చాలా కారణాలే ఉన్నయి. ఓ వైపు థియోటర్స్ దొరక్క, మరోవైపు సరైన రేట్లు  రాక మూవీ ఎన్నో రకాలుగా ఇబ్బుందుల్లో ఉంది.

ఇక వరుస సినిమాలతో వస్తున్న నాగశౌర్య, ‘అలా మొదలైంది’తో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న నందిని రెడ్డిల కాంబినేషన్‌ పై మార్కెట్ వర్గాలు అంత హ్యీపీగా లేవు. ఇప్పటికే సెన్సార్‌తో కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా, రిలీజ్ ఎప్పుడు అవుతుందో అంటూ ఎదురుచూపులు చూస్తుంది. ఇదిలా ఉంటే ‘కళ్యాణ వైభోగమే’ నిర్మాతని ఆదుకునేందుకు అభిషేక్ పిక్చర్స్ రంగంలోకి దిగింది.

ఈ మధ్య కాలంలో వరుస సినిమాలను పంపిణీచేస్తూ విజయాలనుఅందుకుంటున్న అభిషేక్ పిక్చర్స్, కళ్యాణ వైభోగమే సినిమా థియేట్రికల్ రిలీజ్ రైట్స్ ని కైవసం చేసుకుంది. తాజాగా ‘నాన్నకు ప్రేమతో’తో సినిమాని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నందిని రెడ్డి తెరకెక్కించిన మూవీ ఎంతప్పటికీ రిలీజ్ కాలేకపోవటంతో, తను అభిషేక్ పిక్ఛర్స్ ని సంప్రదించి ఈ డీల్ ని క్లోజ్ అయ్యేలా చేసింది.

దీంతో అభిషేక్ పిక్చర్స్, కళ్యాణ వైభోగమేకి భారీ ప్రమోషన్స్ ని ప్లాన్ చేశారు. ఆడియో, పోస్టర్స్, ట్రైలర్‌తో ఇప్పటికే అంచనాలను పెంచేసిన కళ్యాణ వైభోగమే సినిమా, మరోసారి చేయనున్న భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకులను థియోటర్స్ కి రప్పించుకోనుందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: