గత కొద్ది సంవత్సరాలుగా మీడియాకు హాట్ టాపిక్ గా మారిన దాసరి చిరంజీవిల సంబంధాలు మరో ఊహించని ట్విస్ట్ తీసుకోబోతున్నాయ అన్న వార్తలు వస్తున్నాయి. కాపులను బీసీల్లో చేర్చాలంటూ నాలుగురోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు దాసరినారాయణరావు చిరంజీవిలు మరికొంతమంది రాజకీయ నేతలతో కలిసి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి వెళ్లనున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

ఈ వార్తలే నిజం అయితే ఇప్పటి వరకు భిన్న ధృవాలుగా ఎంతో కాలంగా ఒకరిని ఒకరు ఇష్టపడని దాసరి చిరంజీవిలను కలిపే సాధనంగా ముద్రగడ దీక్ష మారింది అనుకోవాలి. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు సినిమా సెలెబ్రెటీలు కాపు సామాజిక వర్గ సమస్యల పై కలిసి గళం ఎత్తితే ప్రస్తుతం కోస్తా జిల్లాలను షేక్ చేస్తున్న కాపుల రిజర్వేషన్ సమస్య మరింత ఊపు అందుకునే అవకాశం ఉంది. 

అయితే కొన్ని మీడియా వర్గాలలో వస్తున్న వార్తల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా కిర్లoపూడి వాసులు మాత్రం తమకు ఈ ప్రముఖుల ఓదార్పు పరామర్శలకన్నా ఈ సమస్యకు ఒక ఖచ్చితమైన పరిష్కారం కావాలి అని మీడియా ముఖంగా అడుగుతున్నారు. 

దీనికితోడు ఈ సమస్య చేయదాటకముందే పరిష్కరించండి అని పవన్ కళ్యాణ్ నిన్న తన ట్విటర్ లో కామెంట్ చేసిన నేపధ్యంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం దాసరి చిరంజీవి పవన్ ల స్పందనకు వేదికగా మారింది. ఈరోజు ముద్రగడ దీక్ష పై మరెన్నో ఊహించని ట్విస్ట్ లు ఉండబోతున్నాయి అని తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: