సినిమా పరిశ్రమలో కొత్త పాతా అనే తేడా ఉండదు.. మొదటి సినిమా హిట్ కొడితే చాలు ఆ దర్శకుడి టాలెంట్ ను మెచ్చి గుర్తించి వరుసెంట సినిమా ఆఫర్లను ఇచ్చేస్తుంటారు. ప్రస్తుతం కిశోర్ తిరుమల కూడా అంతే బిజీ అయ్యాడు. నేను.. శైలజ అంటూ రామ్ కు ఎన్నోరోజులుగా వెయిట్ చేస్తున్న సూపర్ హిట్ ఇచ్చి ఇయర్ మొదటి రోజే టాలీవుడ్ కు మంచి హిట్ ఇచ్చాడు. 


ఇక ఆ సినిమా హిట్ తో కిశోర్ పేరు మారుమ్రోగిపోతుంది. ఇప్పటికే చాలామంది హీరోలు తనతో సినిమా చేయడానికి సిద్ధమవగా తను మాత్రం సెలెక్టెడ్ హీరోస్ తో చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ తో ఓ సినిమా కమిట్ అయిన కిశోర్ తిరుమల ఇప్పుడు విక్టరీ వెంకటేష్ తో కూడా సినిమా ఓకే చేయించుకున్నాడట. కిశోర్ చెప్పిన కథ నచ్చడంతో వెంకటేష్ కూడా ఓకే చెప్పడం జరిగింది.


నేను శైలజ సినిమాలో రామ్, కీర్తి సురేష్ :


కొద్దికాలంగా సినిమాలేవి చేయకుండా చాలా గ్యాప్ తీసుకుని సంవత్సరం పాటు అభిమానుల సహనాన్ని పరిక్షించిన వెంకటేష్ ఇప్పుడు వరుసెంట సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం మారుతితో బాబు బంగారం దాదాపు చివరి దశకు రాగా ఇప్పుడు కిశోర్ తిరుమలతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే కిశోర్ తో సినిమా ఓకే కాని తను నితిన్ తో కమిట్ అయిన సినిమా పూర్తయ్యే దాకా వెయిట్ చేసే అవకాశాలు ఉన్నాయి.


వెంకటేష్ హీరోగా వస్తున్న ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్లో నిర్మించడం జరుగుతుంది. నేను శైలజ సినిమా మిగతా భాషల్లో కూడా రీమేక్ చేసే ఆలోచనల్లో కూడా ఉన్నారు. ఇప్పటికే సినిమాకు సంబందించిన రీమేక్ రైట్స్ కోసం మంచి ఆఫర్స్ వస్తున్నాయట. మరి వెంకటేష్ తో శైలజ దర్శకుడు ఎలాంటి సినిమా అందిస్తాడో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: