రాజమౌళి దృష్టిపడితే చాలు ఆస్టార్ దశతిరిగి పోతోంది. ‘బాహుబలి’ బిగినింగ్ లో యాక్టర్ ప్రభాకర్ ను కాలకేయగా మార్చి అతడిని సెలెబ్రెటీగా మార్చేశాడు రాజమౌళి. ఇప్పుడు అదేఅదృష్టం యాక్టర్ అజయ్ ఘోష్ కు పట్టింది. ‘రన్ రాజా రన్’, ‘ఆటోనగర్ సూర్యా’ సినిమాలలో నటించి తన నెగిటివ్ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించిన అజయ్ ఘోష్ ను రాజమౌళి బందిపోటు వీరయ్యగా మార్చివేశాడు. 

ప్రస్తుతం కేరళా ప్రాంతలో షూటింగ్ జరుపుకుంటున్న ‘బాహుబలి 2’ లో అజయ్ ఘోష్ బందిపోటు వీరయ్యగా మారిపోయానని మీడియాకు  లో తెలియచేసాడు. దేవసేన పాత్ర పోషిస్తున్న అనుష్క ట్రైబల్ విలేజ్ లో ఈ బందిపోటు వీరయ్య పాత్ర కనిపిస్తుందని అజయ్ ఘోష్ చెపుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి దాదాపు వారం రోజులు షూటింగ్ లో పాల్గొన్న విషయాన్ని అజయ్ ఘోష్ బయట పెట్టాడు.

విలన్ పాత్రలను డిఫరెంట్ గెటప్ లతో ఎలివేట్ చేయడంలో సిద్ధహస్తుడైన రాజమౌళి చేతిలో అజయ్ ఘోష్ పడటంతో అతడి కెరియర్ మరో ఊహించని మలుపు తీసుకుంది అనుకోవాలి. ఈ వార్తలు ఇలా ఉండగా కోలీవుడ్ లో గతవారం విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న ‘విసారణి’ సినిమాలో సాడిస్ట్ పోలీసు ఆఫీసర్ పాత్రను చేసిన అజయ్ ఘోష్ ను కోలీవుడ్ మీడియా ఆకాశానికి ఎత్తేస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ఆటో డ్రైవర్ నిజజీవితంలో జరిగిన ఒకయదార్ధ సంఘటనను ఆధారంగా తీసుకుని కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఒక చిన్న సినిమా సాధించిన అద్భుత విజయo ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఈసినిమాలో సాడిస్ట్ పోలీస్ గా కనిపించి ‘బాహుబలి 2’ లో బందిపోటుగా కనిపించనున్న అజయ్ ఘోష్ దశ తిరిగింది అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: